
తక్కువ ధరకే మటన్ విక్రయిస్తున్నారని నమ్మ వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు ఊహించని షాక్ తగిలింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ఇన్స్ట్రాగ్రామ్లో రీల్ చూస్తుండగా ఓ వీడియో వచ్చింది. ఆ వీడియో కిజీ మేక మాంసం కేవలం రూ. 250కే ఇస్తామంటూ యాడ్ వచ్చింది. అయితే తక్కువ ధరకే మేకలు కావాలంటే రాజస్థాన్ రావాల్సి ఉంటుందని ఆ వీడియోలో ఉన్న వ్యక్తి చెప్పడంతో అది నిజమేనని నమ్మిన వ్యక్తి తన ఫ్రెండ్కు కూడా ఈ విషయాన్ని చెప్పాడు.
దీంతో ఇద్దరూ కలిసి మేకల కొనుగోలు కోసం స్వయంగా రాజస్థాన్ వెళ్లారు. వీడియోలో చెప్పిన అడ్రస్కు వెళ్లి అక్కడ మేకలను కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, వారు సరిగ్గా రాజస్థాన్ – మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోకి రాగానే.. అప్పటికే స్కెచ్ వేసిన కేటుగాళ్లు చెక్పోస్ట్ పేరుతో తీవ్ర హడావుడి సృష్టించారు.
మీ వాహనాన్ని చెక్ చేయాలంటూ.. ఈ వాహనాలు మార్చాలని వారిని నమ్మించి, మేకలతో ఉన్న వాహనాన్ని అక్కడి నుంచి ఎత్తుకెళ్లారు. దీంతో తాము మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన బాధితులు వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.