ఆశ్రమంలో దారుణం.. ఇద్దరు మైనర్‌ బాలికలపై ఓ స్వామీజీ అత్యాచారం..

సభ్య సమాజం తలదించుకునే సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. మంచి మాటలు బోధించాల్సిన ఓ స్వామీజీ.. ఆయన హితబోధ చేస్తాడని వెళ్లిన ఓ ఇద్దరు మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని పంచకుల ప్రాంతంలోని కల్కాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కల్కాలో ఉన్న ఓ ఆశ్రమంలో బోధనలు చేస్తున్న ఓ స్వామీజీ వద్దకు.. హిమాచల్ ప్రదేశ్‌కు రాష్ట్రంలోని బద్ది ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు వచ్చారు. అయితే బోధనలు చేస్తున్న ఆ స్వామీజీకి ఈ ఇద్దరు […]

ఆశ్రమంలో దారుణం.. ఇద్దరు మైనర్‌ బాలికలపై ఓ స్వామీజీ అత్యాచారం..

Updated on: Jan 30, 2020 | 10:27 AM

సభ్య సమాజం తలదించుకునే సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. మంచి మాటలు బోధించాల్సిన ఓ స్వామీజీ.. ఆయన హితబోధ చేస్తాడని వెళ్లిన ఓ ఇద్దరు మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని పంచకుల ప్రాంతంలోని కల్కాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కల్కాలో ఉన్న ఓ ఆశ్రమంలో బోధనలు చేస్తున్న ఓ స్వామీజీ వద్దకు.. హిమాచల్ ప్రదేశ్‌కు రాష్ట్రంలోని బద్ది ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు వచ్చారు.

అయితే బోధనలు చేస్తున్న ఆ స్వామీజీకి ఈ ఇద్దరు మైనర్లపై కన్ను పడింది. దీంతో అతడు స్వామీజీ అన్న విషయం మరిచిపోయి.. అతనిలోని కామాంధుడు బయటపడ్డాడు. ఆ ఇద్దరు మైనర్ బాలికలను బంధించి.. వారిపై మూడు రోజుల పాటు పలు మార్లు అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధిత బాలికలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం సదరు బాలికలను ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పంచకులలోని ఆశ్రమంలో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us