రైలు కింద పడబోయిన వ్యక్తిని కాపాడిన ఆర్పీఎఫ్ సిబ్బంది

| Edited By:

Jul 29, 2020 | 2:39 PM

రైలు దిగబోతూ కాలు జారి కింద పడబోయిన ఓ వ్యక్తిని అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాల్ని కాపాడాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన..

రైలు కింద పడబోయిన వ్యక్తిని కాపాడిన ఆర్పీఎఫ్ సిబ్బంది
Follow us on

రైలు దిగబోతూ కాలు జారి కింద పడబోయిన ఓ వ్యక్తిని అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాల్ని కాపాడాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడే ఉన్న ఓ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. విధుల్లో భాగంగా కే సాహూ అనే ఆర్పీఎఫ్‌కు చెందిన సిబ్బంది కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయిత ప్లాట్‌ ఫాంపై ఉండగా.. అటుగా వెళ్తున్న ట్రైన్‌లో నుంచి ఓ 52 ఏళ్ల వ్యక్తి కిందకు దిగబోయాడు. అయితే ట్రైన్ వేగంగా వెళ్తుండటంతో అదుపుతప్పి కింద పడబోయాడు. వెంటనే అప్రమత్తమై ఆర్పీఎఫ్ సిబ్బంది అతడిని రైలు కింద పడకుండా రక్షించారు. ఈ ఘటనలో సాహూతో పాటు మరో సిబ్బంది కూడా పాల్గొన్నారు. అయితే ప్రయాణికుడు నిర్లక్ష్యంగా దిగడం సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది.