Guru Teg Bahadur: గురుద్వారాను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రత్యేక ప్రార్థనలు.. సెక్యూరిటీ లేకుండానే..
PM Narendra Modi: దేశంలోని పలు గురుద్వారాల్లో ఈరోజు సిక్కు మతస్తుల 9వ గురు తేజ్ బహదూర్ 400వ ప్రకాశ్ పర్వ్ కార్యక్రమాన్ని భక్తిశ్రద్దలతో
PM Narendra Modi: దేశంలోని పలు గురుద్వారాల్లో ఈరోజు సిక్కు మతస్తుల 9వ గురు తేజ్ బహదూర్ 400వ ప్రకాశ్ పర్వ్ కార్యక్రమాన్ని భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం ఢిల్లీలోని గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ను సందర్శించి ప్రార్థనలు చేశారు. గురుద్వారాలో సిక్కుల వెంట పూజలు చేస్తూ కనిపించారు. కాగా శనివారం ఉదయం ప్రధాని మోదీ ఎటువంటి సెక్యూరిటీ, ట్రాఫిక్ ఆంక్షలు లేకుండానే గురుద్వారాకు చేరుకున్నారు. సిక్కు మతస్తుల 9వ గురువు తేజ్ బహదూర్ 400వ ప్రకాశ్ పర్వ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరై ప్రార్థనలు చేశారు.
#WATCH | Prime Minister Narendra Modi visited Gurudwara Sis Ganj Sahib in Delhi today morning and offered prayers on the 400th Prakash Purab of Guru Teg Bahadur. pic.twitter.com/jI7NMFA3R0
— ANI (@ANI) May 1, 2021
దీనిని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురు తేజ్ బహదూర్ స్మారకాన్ని జాతికి అంకితం చేయనున్నారు. గురు తేజ్ బహదూర్ 400వ ప్రకాశ్ పర్వ్ సందర్భంగా ప్రధాని మోదీ ఉదయం.. ట్విట్టర్ ద్వారా నివాళులర్పించి.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Prime Minister Narendra Modi visited Gurudwara Sis Ganj Sahib in Delhi today morning and offered prayers on the 400th Prakash Purab of Guru Teg Bahadur. pic.twitter.com/jbWapgHPYo
— ANI (@ANI) May 1, 2021
ఇదిలాఉంటే.. పంజాబ్లో కూడా గురు తేజ్ బహదూర్ 400వ ప్రకాశ్ పర్వ్ ఘనంగా జరుగుతోంది. ఉదయాన్ని సిక్కు మతస్థులు అమృత్సర్లోని గురుద్వారాకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దీంతోపాటు పలు గురుద్వారాల్లో కూడా ప్రకాశ్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
Also Read: