
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరిగ్గా 32 ఏళ్ల క్రితం ఇదే రోజున దేశ ప్రధాని అయోధ్య రామమందిరానికి చేరుకున్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన ఏకతా యాత్రలో ఆయన ఉన్నట్లు ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అలనాటి మధుర జ్ఙాపకాలను నెమరువేసుకున్నారు. రామ మందిరం గురించిన సందేశాన్ని దేశం మొత్తం వ్యాప్తి చేయడానికి ఆయన ఈ యాత్రలో ఉన్నారు. అప్పట్లో ‘జై శ్రీరామ్’ నినాదాల మధ్య, నరేంద్ర మోడీ ఒక ప్రతిజ్ఞ చేశారు. అయోధ్యలో రామ మందిరం కట్టినప్పుడే తిరిగి వస్తానన్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. కాశ్మీర్ను భారత్లో విలీనం చేయడం ద్వారా బీజేపీ దేశాన్ని ఏకం చేయడానికి తపస్సు చేసినట్లు ఈ సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఎట్టకేలకు శతాబ్దాల కలగా మిగిలిన భగవాన్ శ్రీరాముని ఆలయాన్ని ప్రతిష్టించబడిందని రాసుకొచ్చారు.
ఇదిలా ఉంటే జనవరి 22న శ్రీరామ మందిరానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనుంది. దీని కోసం యావత్ దేశం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే.. వివిధ రాష్ట్రాల నుంచి విలువైన వస్తువులు అయోధ్యకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా గుజరాత్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్ నుంచి దీపాలు, ధూపం బత్తీలు అయోధ్య నగరానికి చేరకుంటున్నాయి. ప్రత్యేకమైన బలగాలు పహారా కాస్తున్నాయి. అయోధ్య నగరమంతా డ్రోన్లతో నిఘా పెట్టారు. ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా మొత్తం సిబ్బంది రీహార్సల్ కూడా చేశారు.
On this exact day, 32 years ago, @narendramodi arrived at the #AyodhyaRamTemple. He was on a Yatra to spread the message of unity from Kanyakumari to Kashmir, the Ekta Yatra.
Amidst chants of 'Jai Shri Ram', Narendra Modi vowed to return only when the Ram Temple was built.
The… pic.twitter.com/nbLxkTFN9V
— Modi Archive (@modiarchive) January 14, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..