అంతరిక్షం అంటేనే సాహసం..అనుక్షణం సవాల్!. 2024 జూన్ 5న వారం రోజుల అంతరిక్షయానానికి వెళ్లిన సునీతా విలియమ్స్ అండ్ విల్మోర్లు.. సాంకేతిక సమస్యలతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 9నెలలపాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీత, విల్మోర్లు.. చెక్కుచెదరని విల్పవర్తో తిరిగి భూమిపైకి చేరుకున్నారు. ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్-ఎక్స్తో కలిసి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది నాసా. సునీత అండ్ టీమ్ని ఫ్లోరిడా తీరంలో సేఫ్గా ల్యాండ్ చేసింది. నిప్పులు చిమ్ముతూ భూవాతావరణంలోకి ప్రవేశించిన స్పేస్ క్యాప్స్యూల్ నుంచి విజయవంతంగా పారాచూట్స్ తెరుచుకున్నాయి. ఆ కొద్దిసేపటికే సముద్ర జలాల్లో క్షేమంగా ల్యాండైంది. ముందుగా ప్రకటించిన టైమ్కే.. అంటే సరిగ్గా 3గంటల 27నిమిషాలకే వ్యోమనౌక.. సేఫ్గా దిగింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు ఆస్ట్రోనాట్లు నిక్ హేక్, గోర్బునోవ్ కూడా భూమి పైకి చేరుకున్నారు. సునీత విలియమ్స్ భూమ్మీద అడుగుపెట్టగానే అటు అమెరికా.. ఇటు భారత్లోనూ సంబరాలు అంబరాన్నంటాయి. గుజరాత్తోపాటు.. పలు రాష్ట్రాల్లో టపాసులు కాల్చి పండగ చేసుకున్నారు.
కాగా.. సునీతా విలియమ్స్ క్రూ9 వ్యోమగాములు దివి నుంచి భువిపై కి అడుగుపెట్టడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.. క్రూ9 తిరిగి స్వాగతం.. భూమి మిమ్మల్ని మిస్ అయింది.. అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
Welcome back, #Crew9! The Earth missed you.
Theirs has been a test of grit, courage and the boundless human spirit. Sunita Williams and the #Crew9 astronauts have once again shown us what perseverance truly means. Their unwavering determination in the face of the vast unknown… pic.twitter.com/FkgagekJ7C
— Narendra Modi (@narendramodi) March 19, 2025
‘‘తిరిగి స్వాగతం, #Crew9! భూమి మిమ్మల్ని మిస్ అయింది.
వారిది ధైర్యసాహసాలు, ధైర్యం – అపరిమిత మానవ స్ఫూర్తికి పరీక్ష. సునీతా విలియమ్స్, #Crew9 వ్యోమగాములు మరోసారి పట్టుదల అంటే ఏమిటో మనకు చూపించారు. తెలియని విస్తారమైన పరిస్థితులను ఎదుర్కొనే వారి అచంచలమైన సంకల్పం లక్షలాది మందికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది.
అంతరిక్ష అన్వేషణ అంటే మానవ సామర్థ్యం పరిమితులను అధిగమించడం.. కలలు కనే ధైర్యం.. ఆ కలలను వాస్తవంగా మార్చే దృఢ సంకల్పాన్ని కలిగి ఉండటం.. ఒక మార్గదర్శకురాలు, ఐకాన్ అయిన సునీతా విలియమ్స్ తన కెరీర్ అంతటా ఈ స్ఫూర్తిని ప్రదర్శించారు.
వారు సురక్షితంగా తిరిగి రావడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన వారందరినీ చూసి మేము చాలా గర్వపడుతున్నాము. ఖచ్చితత్వం అభిరుచి కలిసినప్పుడు.. దానికి తోడు సాంకేతికత – పట్టుదల కలిస్తే ఏమి జరుగుతుందో వారు చూపించారు..’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు..
కాగా.. అంతకు ముందు భారత్కు రావాలని వ్యోమగామి సునీతా విలియమ్స్ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. వేల మైళ్ల దూరంలో ఉన్నా మీరు ఎప్పుడు మా గుండెల్లో ఉంటారని అన్నారు. సునీతా విలియమ్స్కు ఈ నెల ఒకటిన ప్రధాని రాసిన లేఖను కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ఎక్స్లో షేర్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..