ఇవాళ ట్రంప్‌తో భేటీ కానున్న ప్రధాని మోదీ.. సర్వత్రా ఆసక్తి

ప్రధాని మోదీ ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు. జీ-7 దేశాల సమ్మేళనంలో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న మోదీ ఆదివారం బియారిట్జ్‌ నగరానికి చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఇరువురి ఈ భేటీ జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఇరు దేశాలమధ్య వాణిజ్య సంబంధాలపై చర్చ జరగనుంది. అదే విధంగా జమ్ము కశ్మీర్ అంశంపై కూడా ట్రంప్‌తో నేరుగా చర్చించనున్నారు. ఇప్పటికే ట్రంప్‌కు ఈ విషయంపై ఫోన్ ద్వారా […]

ఇవాళ ట్రంప్‌తో భేటీ కానున్న ప్రధాని మోదీ.. సర్వత్రా ఆసక్తి

Updated on: Aug 26, 2019 | 1:06 AM

ప్రధాని మోదీ ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు. జీ-7 దేశాల సమ్మేళనంలో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న మోదీ ఆదివారం బియారిట్జ్‌ నగరానికి చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఇరువురి ఈ భేటీ జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఇరు దేశాలమధ్య వాణిజ్య సంబంధాలపై చర్చ జరగనుంది. అదే విధంగా జమ్ము కశ్మీర్ అంశంపై కూడా ట్రంప్‌తో నేరుగా చర్చించనున్నారు. ఇప్పటికే ట్రంప్‌కు ఈ విషయంపై ఫోన్ ద్వారా చెప్పారు. ఇదిలా ఉంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ అనుసరిస్తున్న విధానాలపై కూడా ట్రంప్‌కు వివరించనున్నారు. ఇక సోమవారం సాయంత్రం 6.30కు ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రెటరితో కూడా సమావేశం కానున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us