తాగిన మైకంలో కట్టుకున్న భార్యను కడతేర్చాడు..

|

Jul 30, 2020 | 8:27 PM

తాగిన మైకంలో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ దుర్మార్గపు భర్త. పీకల దాక తాగేసి వచ్చి ఆ ఇల్లాలితో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే ఆమెను తీవ్రంగా కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

తాగిన మైకంలో కట్టుకున్న భార్యను కడతేర్చాడు..
Follow us on

తాగిన మైకంలో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ దుర్మార్గపు భర్త. పీకల దాక తాగేసి వచ్చి ఆ ఇల్లాలితో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే ఆమెను తీవ్రంగా కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటన బీహార్ రాష్ట్రం పూర్నియా జిల్లా మంగ్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

బీహార్ రాష్ట్రం నోయిడా గ్రామానికి దంపతులు ఓ అద్దె ఇంట్లో ఉంటూ..కూలి పనులు చేసుకుంటూ జీవించేవారు. భార్య భర్తలిద్దరూ ఉదయాన్నే పని వెళ్లి తిరిగి సాయంత్రానికి ఇళ్లు చేరుకునేవారు. అయితే, భర్తకు మాత్రం తాగుడు అలవాటు విపరీతంగా ఉండేది. ప్రతి రోజూ ఫుటుగా తాగేసి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే జూలై 27న కూడా రాత్రి సమయంలో బాగా తాగేసి వచ్చిన అతడు భార్యతో ఘర్షణ పడ్డాడు. ఆమెను విచక్షణా రహితంగా చితకబాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ మ‌ృతదేహన్ని పక్కనే ఉన్న పంటపొలాల్లో పడేసి ఏమీ తెలియనట్లుగా ఉన్నాడు.

మర్నాడు పొలం పనుల కోసం వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీం ఆధారంగా నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అతన్ని రిమాండ్‌కు తరలించారు.