కశ్మీర్‌ అంశంపై విచారణకు సుప్రీం బ్రేక్.. సమయం లేదని వ్యాఖ్య

| Edited By: Pardhasaradhi Peri

Sep 30, 2019 | 4:18 PM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో పరిస్థితులు కేంద్ర ప్రభుత్వ చెప్పినట్టుగా లేవని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై సోమవారం విచారణ జరిగింది. వెంటనే  విచారణను ముంగళవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మాట్లాడుతూ అయోధ్య కేసులో ప్రతిరోజు వాదనలు వినాల్సి ఉన్నందున కాశ్మీర్ విషయంలో దాఖలైన కేసులపై సమయం లేదంటూ వ్యాఖ్యానించారు. “మాకు చాలా విషయాలు వినడానికి సమయం లేదు. […]

కశ్మీర్‌ అంశంపై విచారణకు సుప్రీం బ్రేక్.. సమయం లేదని వ్యాఖ్య
Follow us on

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో పరిస్థితులు కేంద్ర ప్రభుత్వ చెప్పినట్టుగా లేవని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై సోమవారం విచారణ జరిగింది. వెంటనే  విచారణను ముంగళవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మాట్లాడుతూ అయోధ్య కేసులో ప్రతిరోజు వాదనలు వినాల్సి ఉన్నందున కాశ్మీర్ విషయంలో దాఖలైన కేసులపై సమయం లేదంటూ వ్యాఖ్యానించారు.

“మాకు చాలా విషయాలు వినడానికి సమయం లేదు. అయోధ్య కేసు వినడానికే రాజ్యాంగ ధర్మాసనం ఉందని” సిజెఐ రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం రేపటి నుంచి కాశ్మీర్‌కు సంబంధించిన అన్ని కేసులను విచారించనుంది. అయితే కశ్మీర్ కేసులను విచారించిన ప్రధాన న్యాయమూర్తి, మరో ఇద్దరు న్యాయమూర్తులు కూడా అయోధ్య బెంచ్‌లో ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నవంబర్ 17 న పదవీ విరమణ చేసే ముందు అయోధ్య తీర్పు ఇవ్వాలి, లేదా మొత్తం ప్రక్రియను మళ్ళీ ప్రారంభించాల్సి ఉంటుంది.

జమ్ము కశ్మీర్‌‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జర్నలిస్టుల కదలికలపై ఆంక్షలు విధించారని, కశ్మీర్ లోయలో మైనర్లను అక్రమంగా నిర్బంధించినట్టు దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తోంది. పిల్లలను అక్రమంగా నిర్బంధించారని బాలల హక్కుల కార్యకర్త ఎనాక్షి గంగూలీ, ప్రొఫెసర్ శాంతా సిన్హా పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు మంగళవారం విచారించనుంది. అదే విధంగా కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ వేసిన మరో దాఖలు చేసిన మరో పిటిషన్‌పై కూడా మంగళవారం విచారణ జరగనుంది.