
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఒక యువకుడు తనను తాను చెంపదెబ్బ కొట్టుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఆ యువకుడు ఒక ట్రక్ డ్రైవర్. డ్రైవర్ సెలవు అడిగాడని అతని యజమాని 31 చెంపదెబ్బల తాలిబానీ శిక్ష విధించాడు. ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో పోలీసుల కంట పడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడు ఒక గదిలో నిలబడి ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ గది ఒక ఆఫీసులా ఉంది. ఆ ట్రక్కు డ్రైవర్ను అతని యజమాని సెలవు విషయమై బెదిరిస్తున్నాడు. దీని తరువాత అతను డ్రైవర్ను తన చెంప మీద కొట్టమని కోరాడు. వీడియోలో ట్రక్ డ్రైవర్ తన చెంప మీద కొట్టుకోవడం కనిపిస్తుంది. అతను చెంపదెబ్బ కొట్టి ఆపినప్పుడు, యజమాని, “నువ్వు ఇంకా సంతృప్తి చెందలేదు, మళ్ళీ నిన్ను నువ్వు చెంపదెబ్బ కొట్టుకో” అంటాడు.
దీని తరువాత డ్రైవర్ మళ్ళీ తనను తాను చెంపదెబ్బ కొట్టుకోవడం ప్రారంభించాడు. అలా 31 సార్లు కొట్టుకున్న తర్వాత ఆపేశాడు. సెలవు అడిగినందుకు మాత్రమే అతనికి ఈ శిక్ష విధించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత డ్రైవర్ కాన్పూర్లోని తన ఇంటికి వెళ్ళాడు. ఈ కేసులో బాధితుడు డ్రైవర్ కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అయితే దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. పోలీసుల నుంచి కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ముజఫర్నగర్ పోలీసులు ఈ వీడియోను చూసిన తర్వాత దర్యాప్తు ప్రారంభించారు. ట్రక్కు డ్రైవర్ యజమాని (వ్యాపారవేత్త) గతంలో కూడా అనేక సందర్భాల్లో వార్తల్లో నిలిచినట్లు సమాచారం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..