AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళ సచివాలయంలో అగ్నిప్రమాదం.. బూడిదైన కీలక పత్రాలు

కేరళ సచివాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్రటేరియట్ రెండో అంతస్తులోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సెక్షన్ నుంచి పొగలు వచ్చాయి

కేరళ సచివాలయంలో అగ్నిప్రమాదం.. బూడిదైన కీలక పత్రాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 26, 2020 | 8:21 AM

Share

Kerala Fire Accident: కేరళ సచివాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్రటేరియట్ రెండో అంతస్తులోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సెక్షన్ నుంచి పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో కొన్ని కీలక పత్రాలు కాలి బూడిదైనట్లు అధికారులు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

కాగా ఈ ఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల సంచలనం సృష్టించిన గోల్డ్‌ స్కాంతో సంబంధాలున్న పత్రాలను నాశనం చేసేందుకు ప్రభుత్వమే ఈ నాటకం ఆడిందని వారు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా బంగారు చోరీ కేసు అంశం ప్రస్తుతం సీఎం పినరయి విజయన్ కార్యాలయ పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే.

Read More:

జేఈఈ-నీట్ పరీక్షలు: మార్గదర్శకాలు విడుదల

ఎంపీ కేకేను బురిడీ కొట్టించే ప్రయత్నం.. వ్యక్తిపై కేసు నమోదు