లద్ధాఖ్లోని గాల్వన్ వాలీ దగ్గర జరిగిన ఘర్షణలో అమరుడైన చంద్రకాంత ప్రధాన్ అంత్యక్రియలు ముగిశాయి. ఒడిశాలోని కంద్మల్లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గాల్లో కాల్పులు జరిపి సైనిక వందనం సమర్పించారు సైనికులు. కుటుంబ సభ్యులు, బంధువులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అశృనయనాలతో వీరజవాన్కు వీడ్కోలు పలికారు.
గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో పశ్చిమబెంగాల్లోని బిర్బుమ్కు చెందిన రాజేష్ ఒరాంగ్ అమరుడయ్యారు. దీంతో స్వరాష్ట్రానికి భౌతిక కాయం చేరుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించారు. సైనిక లాంఛనాలతో రాజేష్ ఒరాంగ్కు అంత్యక్రియలు నిర్వహించారు.