పాక్‌కి షాకిచ్చిన మాజీ ప్రధాని.. ఎందుకో తెలుసా?

| Edited By: Pardhasaradhi Peri

Sep 30, 2019 | 6:51 PM

పాకిస్తాన్‌కు షాకిచ్చారు  భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవం కోసం పాక్ ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పలికింది. గురు నానక్ 550 జయంతి సందర్భంగా పాక్ ప్రభుత్వం, భారత్‌లో ఉన్న సిక్కు యాత్రికుల కోసం కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించబోతుంది. ఈ కార్యక్రమానికి మన్మోహన్ సింగ్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తున్నట్టు పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ప్రకటించిన కొద్ది సేపటికే మన్మోహన్ దాన్ని తిరస్కరించనున్నారని కాంగ్రెస్ […]

పాక్‌కి షాకిచ్చిన మాజీ ప్రధాని.. ఎందుకో తెలుసా?
Follow us on

పాకిస్తాన్‌కు షాకిచ్చారు  భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవం కోసం పాక్ ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పలికింది. గురు నానక్ 550 జయంతి సందర్భంగా పాక్ ప్రభుత్వం, భారత్‌లో ఉన్న సిక్కు యాత్రికుల కోసం కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించబోతుంది. ఈ కార్యక్రమానికి మన్మోహన్ సింగ్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తున్నట్టు పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ప్రకటించిన కొద్ది సేపటికే మన్మోహన్ దాన్ని తిరస్కరించనున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

పాకిస్తాన్‌లో సిక్కు మతానికి చెందిన వారి సంఖ్య అత్యధికంగా ఉంది. భారత్‌లో ఉన్నట్టుగానే అక్కడ కూడా పంజాబ్ ఉంది. అయితే వచ్చే నెల నవంబర్‌లో జరిగే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మన్మోహన్‌కు ఆహ్వానం పలుకుతూ ఆదేశ విదేశాంగ మంత్రి ఖరేషీ వీడియో సందేశంలో మాట్లాడారు. కర్తార్‌పూర్ కారిడార్ అనేది కార్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్ నుంచి పంజాబ్‌లోని గురుదాస్ పూర్ జిల్లాలోని డేరాబాబా నానక్ ఆశ్రమం వరకు ఈ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. కర్తార్‌పూర్‌లోని గురుద్వారా సాహిబ్ వరకు పాక్ దీన్ని నిర్మిస్తుండగా, పంజాబ్‌లోని డేరా బాబా నానక్ నుంచి భారత్ నిర్మిస్తోంది. దీంతో భారత్‌లో నుంచి వెళ్లే సిక్కు భక్తులు ఎటువంటి వీసా మతులు లేకుండానే అక్కడి వెళ్లే వీలుకల్పిస్తున్నారు. కేవలం అక్కడి వెళ్లేందకు పర్మిషన్ తీసుకుంటే చాలు.