కొండచిలువలా పాకుకుంటూ ఆ యువకుడి వినూత్న నిరసన.. ఎందుకో తెలుసా?

మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లా బిషన్ ఖేడి గ్రామ ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, గ్రామానికి చెందిన ఒక వ్యక్తి దరఖాస్తుల పొడవైన క్యూను కొండచిలువ ఆకారంతో భోపాల్‌లోని డివిజనల్ కమిషనర్‌ కార్యాలయానికి వచ్చాడు. ఇప్పటి వరకు 500 కి పైగా దరఖాస్తులు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఇలా వినూత్న రీతిలో నిరసన తెలిపాడు.

కొండచిలువలా పాకుకుంటూ ఆ యువకుడి వినూత్న నిరసన.. ఎందుకో తెలుసా?
Unique Protest for Water

Updated on: Apr 04, 2025 | 6:16 PM

వేసవి కాలం ప్రారంభమైన వెంటనే మధ్యప్రదేశ్‌లో పరిస్థితి మరింత దిగజారింది. నీటి కొరత తీవ్ర స్థాయిలో నెలకొంది. ముఖ్యంగా సెహోర్ జిల్లాలోని బిషన్ ఖేడి గ్రామ ప్రజలు తాగునీరు అవస్థలు పడుతున్నారు. దీంతో డివిజనల్ కమిషనర్ సంజీవ్ సింగ్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా బజరంగీ నగర్ సామాజిక కార్యకర్త విచిత్ర రీతిలో ఫిర్యాదు చేశారు. ఇలా ఇప్పటివరకు ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, కలెక్టర్‌కు 500 కి పైగా దరఖాస్తులను సమర్పించాడు. కానీ ఎటువంటి విచారణ లేనప్పుడు, అతను దరఖాస్తుల కొండచిలువలా పాకుతూ డివిజనల్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నాడు. ఇక్కడ అతను తన బాధను వ్యక్తం చేశాడు.

బిషన్ ఖేడి గ్రామంలో నీరు లేకుండా జీవితం కష్టంగా మారిందని అంటున్నారు. ప్రభుత్వం మా సమస్యను గుర్తించి త్వరగా పరిష్కరించాలి. బాధితుడు బజరంగీ నగర్ తనను తాను కొండచిలువగా మార్చుకుని నిరసన తెలిపాడు. డజన్ల కొద్దీ దరఖాస్తులను తయారు చేసి డివిజనల్ కమిషనర్ ముందు సమర్పించారు. గ్రామంలోని రెండు ప్రభుత్వ బావులకు సర్పంచ్ వలలు బిగించి తాళం వేసేశారని అతను ఆరోపించాడు. దీనివల్ల స్థానిక ప్రజలు 2 కిలోమీటర్ల దూరం నుండి నీటిని తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

PHP విభాగం యంత్రాన్ని రెండుసార్లు బోరింగ్ కోసం పంపింది. కానీ స్థానిక నాయకుల ఒత్తిడితో దానిని చేయడానికి అనుమతించలేదు. బిషన్ ఖేడి గ్రామస్తులు తమ డిమాండ్లతో రాజధాని భోపాల్‌కు రావడం ఇదే మొదటిసారి కాదు. దాదాపు 2 నెలలుగా గ్రామస్తులు అధికారుల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, సమస్య పరిష్కారం కానప్పుడు, వారు దరఖాస్తుల గుట్టలా డివిజనల్ కమిషనర్ కార్యాలయానికి చేరుకోవడం ద్వారా ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రదర్శన చేశారు.

గ్రామంలో నీటి సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు అధికారులను డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై జాయింట్ కమిషనర్ డాక్టర్ వినోద్ యాదవ్ స్పందించారు. సెహోర్‌లోని బిషన్ ఖేడి గ్రామస్తులు కొంతమంది నీటి సమస్య గురించి తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. సెహోర్ జిల్లా పంచాయతీ CEO, PHE అధికారులను ఈ సమస్యను దర్యాప్తు చేసి పరిష్కరించాలని ఆదేశించామన్నారు. సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని జాయింట్ కమిషనర్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..