టికెట్ లేకుండా ప్రయాణం.. రైల్వేకు భారీ ఆదాయం

| Edited By:

Aug 27, 2019 | 8:08 AM

భారతదేశంలో అత్యధిక ఆదాయం గడించే సంస్థల్లో రైల్వేస్ ఒకటి. భారత రైల్వేల్లో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. కాగా వీరిలో కొంతమంది టికెట్ తీసుకోకుండానే పయనిస్తుంటారు. అయితే ఇలా టికెట్ లేకుండా ప్రయాణించే వారి వల్లనే రైల్వేకు భారీ ఆదాయం వచ్చిందట. అదెలా అనుకుంటున్నారా..? అలాంటి వారు ప్రయాణంలో ఏదో ఒక చోట అధికారులకు పట్టుబడి భారీగా జరిమానాలు చెల్లిస్తుంటారు. ఇలా మూడేళ్లలో దాదాపు 89లక్షల మంది పట్టుబడగా.. వారి నుంచి జరిమానాల రూపంలో […]

టికెట్ లేకుండా ప్రయాణం.. రైల్వేకు భారీ ఆదాయం
Follow us on

భారతదేశంలో అత్యధిక ఆదాయం గడించే సంస్థల్లో రైల్వేస్ ఒకటి. భారత రైల్వేల్లో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. కాగా వీరిలో కొంతమంది టికెట్ తీసుకోకుండానే పయనిస్తుంటారు. అయితే ఇలా టికెట్ లేకుండా ప్రయాణించే వారి వల్లనే రైల్వేకు భారీ ఆదాయం వచ్చిందట. అదెలా అనుకుంటున్నారా..? అలాంటి వారు ప్రయాణంలో ఏదో ఒక చోట అధికారులకు పట్టుబడి భారీగా జరిమానాలు చెల్లిస్తుంటారు. ఇలా మూడేళ్లలో దాదాపు 89లక్షల మంది పట్టుబడగా.. వారి నుంచి జరిమానాల రూపంలో రైల్వే అధికారులు రూ.1,377కోట్లు వసూలు చేశారట.

ఈ విషయం తాజాగా బయటికొచ్చింది. ఇటీవల రైల్వేల్లో జరిమానాలపై మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త రైల్వేబోర్డుకు దరఖాస్తు చేశారు. దానికి అధికారులు సమాధానం ఇచ్చారు. ఇక అందులో 2016-17 సంవత్సరంలో రూ. 405.30కోట్లు.. 2017-18లో రూ. 441.62కోట్లు.. 2018-19లో రూ. 530.06కోట్లు జరిమానాల రూపంలో వచ్చిందని తేలింది. ఇలా మొత్తం మూడు సంవత్సరాల్లో టికెట్ లేని ప్రయాణికుల నుంచి రూ.1,377 కోట్ల ఆదాయాన్ని రైల్వే ఆర్జించింది.