చుట్టూ మంటలు.. మధ్యలో భారత్! దేశం చుట్టూ కుట్ర… చైనా చేయి ఉందా?

భారత్ చుట్టూ కుట్ర జరుగుతున్న మాట కాదనలేం. ఆమధ్య లంకకు నిప్పంటుకుని ప్రభుత్వమే కుప్పకూలింది. రీసెంట్‌గా.. నేపాల్‌లో జెన్-జీ యావత్ దేశాన్నే తగలబెట్టేసేంత పని చేసింది. పాకిస్తాన్ ఎప్పుడూ చైనా చెప్పుచేతల్లోనే ఉంటుంది. అదెప్పుడూ నివురుగప్పిన నిప్పే. ఇప్పుడు.. బంగ్లాదేశ్ రగిలిపోతోంది. వీటన్నింటి వెనకా డ్రాగన్ కంట్రీ ఉందా? భారత్‌పైకి ఈ దేశాలన్నింటినీ ఎగదోయాలనే ప్లాన్ ఉందా? ఇప్పటికైతే అనుమానాలే.. అలాగని.. భారత్ ఏమీ చేయడం లేదనుకుంటే పొరపాటే.. బంగ్లాదేశ్‌లో ఎవరికో ట్రైనింగ్ ఇవ్వడానికి అమెరికా నుంచి వచ్చాడో వ్యక్తి. ఏం జరిగిందో తెలీదు.. స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఈజిప్ట్ నుంచి, ఇరాక్ నుంచి.. ఇలా కొన్ని దేశాల నుంచి బంగ్లాదేశ్ వచ్చిన వాళ్లు హోటల్ రూమ్స్‌లో చనిపోయారు. అన్నీ మిస్టీరియస్ డెత్స్. అలా చనిపోయిన వాళ్లలో పాక్ నుంచి బంగ్లాదేశ్‌కు వచ్చిన ఇంటెలిజెన్స్ వాళ్లు కూడా ఉన్నారు. ఎవరో 'గుర్తు తెలియని వ్యక్తులు' చేశారట. సో, భారత్‌ను ఏదో చేద్దామని దిగుతున్న వాళ్లంతా అంతుచిక్కని రీతిలో చనిపోతున్నారు. అలా చనిపోయిన విద్యార్థి నాయకుడే ఉస్మాన్ హాదీ. ఇంతకీ ఏంటని హిస్టరీ? ఎలా చనిపోయాడు. అతని మరణంతో బంగ్లా ఎందుకు మండుతోంది? ఆ చావు భారత్‌పై ద్వేషాన్ని ఎందుకంత పెంచుతోంది?

చుట్టూ మంటలు.. మధ్యలో భారత్!  దేశం చుట్టూ కుట్ర... చైనా చేయి ఉందా?
India, China Playing Games

Updated on: Dec 20, 2025 | 10:35 PM

బంగ్లాదేశ్ రగిలిపోతోంది. ఎందుకని? అక్కడి యువనేత ఉస్మాన్ హాదీని ‘గుర్తు తెలియని వ్యక్తులు’ చంపేశారు. ఈ ‘గుర్తు తెలియని వ్యక్తులు’ అనే టాపిక్ మీద కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పుకోవాలిక్కడ. అబు కతల్‌ అని ఓ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ ఉండేవాడు పాకిస్తాన్‌లో. ఆ ఉగ్రవాది దరిదాపుల్లోకి ఎవరు వెళ్లాలన్నా.. పాక్ ఆర్మీని దాటుకుని వెళ్లాలి. అలాంటిది.. అబు కతల్‌ను ‘గుర్తు తెలియని వ్యక్తులు’ ఫట్‌మని కాల్చి చంపేశారు. 2024లో వైష్ణోదేవి భక్తులపై కాల్పులు జరిపారు. ఆ దాడి వెనక ఉన్నది అమీర్ హంజా. పాక్‌ ఆర్మీలో మాజీ డైరెక్టర్ జనరల్. అమీర్ హంజాకు సెక్యూరిటీ ఏ లెవెల్‌లో ఉంటుంది. బట్‌.. నల్లని దుస్తులు ధరించిన ‘గుర్తు తెలియని వ్యక్తులు’ పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చారు. అమీర్‌ సర్ఫరాజ్‌ అని.. లష్కరే తోయిబా ఫౌండర్‌కు సన్నిహితుడు. భారత్‌కు చెందిన సరబ్‌జిత్ సింగ్‌ను పాక్‌ జైల్లో చంపించింది. అంతటి మాఫియా డాన్‌ను.. లాహోర్‌లో ఇద్దరు ‘గుర్తు తెలియని వ్యక్తులు’ బైక్‌పై వచ్చి కాల్చి చంపారు. 2020 నుంచి 2023 వరకు దాదాపు 20 మందిని ఎవరూ ఊహించని రీతిలో హతమార్చారు. చంపినోళ్లందరూ ‘గుర్తు తెలియని వ్యక్తులే’. వాడు లష్కరే తోయిబా ఉగ్రవాదా, జైషే మహ్మద్‌ టెర్రరిస్టా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఆటంకవాదా? లేదా పాక్‌ ఆర్మీ కనుసన్నల్లో ఉన్న మోస్ట్‌ వాంటెడా..? అక్కడున్నది ఎవరైనా గానీ బుల్లెట్లు దింపుతున్నారంతే. ఇలాంటి ఆపరేషన్స్‌తో పాక్‌లో 26 మంది...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి