Vande Bharat Train: వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి.. అద్దాలు ద్వంసం..

రాళ్లు అద్దాలపై పడటంతో ఒక్క క్షణంలో పెద్ద శబ్దం వచ్చింది. అక్కడ కూర్చొన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అయితే ఎవరికీ ఎలాంటి హాని జరుగకపోవడంతో ఊరట చెందారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న వందే భారత్‌ రైలు సిబ్బంది ఆ కోచ్‌ వద్దకు చేరుకున్నారు. రాళ్ల దాడిలో ధ్వంసమైన..

Vande Bharat Train: వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి.. అద్దాలు ద్వంసం..
Vande Bharat Train

Updated on: Jun 12, 2024 | 6:50 PM

వందే భారత్‌ రైలుపై కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటనలో ఒక కోచ్‌లోని కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి నేపథ్యంలో ఆ కోచ్‌లోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. పంజాబ్‌లోని ఫగ్వారాలో అమృత్‌సర్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై బుధవారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు జరగలేదు కానీ.. వందే భారత్ రైలు కిటికీలు ధ్వంసమయ్యాయి. సి-3 కోచ్ కిటికీపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో సీ 3 కోచ్‌లోని రెండు విండో గ్లాస్‌లకు పగుళ్లు ఏర్పడ్డాయి.

రాళ్లు అద్దాలపై పడటంతో ఒక్క క్షణంలో పెద్ద శబ్దం వచ్చింది. అక్కడ కూర్చొన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అయితే ఎవరికీ ఎలాంటి హాని జరుగకపోవడంతో ఊరట చెందారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న వందే భారత్‌ రైలు సిబ్బంది ఆ కోచ్‌ వద్దకు చేరుకున్నారు. రాళ్ల దాడిలో ధ్వంసమైన కిటికీ అద్దాలను పరిశీలించారు. కొందరు పిల్లలు రాళ్లు విసిరినట్లు ప్రయాణికులు ఆరోపించారు.

అయితే ఈ సంఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో వందే భారత్‌ రైలుపై రాళ్ల దాడి జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు. కానీ, వందేభారత్ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు గతంలో అనేకం జరిగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us