హాథ్రస్‌ ఘటనను సుమోటో కేసుగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో జరిగిన దారుణమైన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్సయ్యింది.. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే ఆ ఘటనలో 19 ఏళ్ల ఓ దళిత యువతిని అగ్రకులానికి చెందిన నలుగురు వ్యక్తులు...

హాథ్రస్‌ ఘటనను సుమోటో కేసుగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

Updated on: Oct 01, 2020 | 12:34 PM

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో జరిగిన దారుణమైన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్సయ్యింది.. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే ఆ ఘటనలో 19 ఏళ్ల ఓ దళిత యువతిని అగ్రకులానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి ఆపై తీవ్రంగా హింసించారు.. ఆమె అరవకుండా నాలుక కోసేశారు. వెన్నెముక విరిచేశారు.. ఈ ఘోర ఘటనలో గాయపడిన ఆ దళిత యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.. కాగా, ఈ ఘటనను సుమోటో కేసుగా స్వీకరించినట్టు జాతీయ మానవ హక్కుల సంఘం తెలిపింది.. దీనిపై వివరణ ఇవ్వాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర డీజీపీకి నోటీలు జారీ చేసింది.. ఈ దుర్మార్గమైన సంఘటన సెప్టెంబర్‌ 14న జరిగింది.. తన తల్లి, సోదరుడితో కలిసి గడ్డి కోసం పొలానికి వెళ్లిన యువతి.. ఆపై కనిపించకుండా పోయింది.. తీవ్రగాయాలతో ఆ యువతిని సెప్టెంబర్‌ 22న కనుగొన్నారు.. బాధితురాలిని మొదట అలీఘడ్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌లో చేర్పించారు.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుప్రతిలో చేర్చారు.. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆమె కన్నుమూసింది. ఈ ఘటనపై దేశం యావత్తు కదిలింది.. నిరసనలు హోరెత్తాయి.. ఆందోళనలు జరుగుతున్నాయి.. ఇంత జరుగుతున్నా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత యువతి మృతదేహాన్ని ఆమె స్వస్థలానికి తీసుకొచ్చిన పోలీసులు హుటాహుటిన అంత్యక్రియలు నిర్వహించారు.. పోలీసుల చర్యపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

Loading...
Unable to load recommendations.
Follow Us