
ఎల్నినోనే కాదు, గతంలో సూపర్ ఎల్నినోనే ఫేస్ చేసింది మన దేశం. 150 ఏళ్లకిందట ఎల్నినో ఎటాక్ చేస్తే, మన దేశంలో వరుసగా రెండేళ్లు రుతుపవనాలు దాదాపుగా లేనేలేవు. వానలు పడక, దాదాపు ఆరుకోట్ల మంది జనం తిండి లేక ఆకలితో అలమటించారు. 11 ఏళ్ల కిందట 2015లో సూపర్ ఎల్నినో భారతదేశం మీద పంజా విసిరినప్పటి చేదు జ్ఞాపకం గుర్తుందా? రుతుపవనాలు బలహీనపడి, లోటు వర్షపాతంతో, ఖరీఫ్ పంట దిగుబడి తగ్గిపోయి, దారుణంగా దెబ్బైపోయింది వ్యవసాయరంగం. కాకపోతే, పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంపై ‘మాడెన్-జూలియన్ ఆసిలేషన్’లో తేడాలొచ్చి, ఒకట్రొండుసార్లు వరుణుడు కరుణించి, ఖరీఫ్ సీజన్కి చిన్నపాటి రిలీఫ్ దక్కింది. మిగతా నాలుగు నెలలు దేశమంతా బీడుబారిన నేలలే వెక్కిరించాయి. వరి, పప్పుదినుసులు, వేరుశనగ ధరలు నింగినంటేశాయి. ఆరేడు రాష్ట్రాలు కరవు రక్కసి కోరల్లో చిక్కుకున్నాయి. వర్షాలను మోసుకొచ్చే మేఘాల్లో తేమను మింగేసే ఆ ఎల్నినో వేడిగాలులు, ఇదిగో ఇప్పుడు మళ్లీ భారతదేశంను టార్గెట్ చేసేశాయి. 2015 నాటి కరవు కంటే రెండుమూడింతల ప్రభావం తప్పదు, బీఎలర్ట్ అని హెచ్చరిస్తూనే ఉంది కేంద్రం. గ్రౌండ్ రిపోర్ట్ అయితే, అంతకుమించి అన్నట్టు దారుణంగా ఉంది. ఊరక బెదరగొట్టరు మహానుభావులు. 56 అంగుళాల ఛాతీ కలిగిన ఆజానుబాహుడే నాలుగడుగులు వెనక్కేశారంటే.....