
తమిళనాడు.. సుమారు తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. అయినా సరే, ఆ రాష్ట్రంలో హామీల హోళీని చల్లుకోవడం ఆపడం లేదు. అన్నాడీఎంకే ‘ఉచిత ఫ్రిజ్’ అంటే.. డీఎంకే దానికి పోటీగా 8వేల రూపాయల కూపన్లు తీసుకోండి, ఇంటికి కావాల్సిన టీవీనో, ఫ్రిడ్జో మీరే కొనుక్కోండి అంటోంది. ఇక విజయ్ ఏకంగా బంగారంతోనే హామీల వేలం పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఏది సంక్షేమం, ఏది ఉచితం అనే దానికి ఇప్పటికీ ఓ డెఫినేషన్ లేదు. ఉచిత పథకాలు అనేవి స్వభావంలో చెడ్డవేం కావు. కాని, వాటిని ఎందుకు, ఎలా ఉపయోగిస్తున్నారు, దేనికి ఉపయోగపడుతున్నాయన్నదే ముఖ్యం. నిజానికి సంక్షేమ పథకాలు అనేవి ఒక ‘పెట్టుబడి’ లాంటివి. వీటివల్ల సొసైటీకి కచ్చితంగా లాభం జరుగుతుంది. వ్యక్తులు లేదా కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి ఒక పునాది వేస్తుంది. సపోజ్.. ఎడ్యుకేషన్ సెక్టార్ని తీసుకుందాం. ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం.. ఇవి ఒక బిడ్డను ప్రయోజకుడిని చేసి, భవిష్యత్తులో టాక్స్ కట్టే పౌరుడిగా మారుస్తాయి. ఇది ఖర్చు కాదు, దేశ భవిష్యత్తుపై పెట్టుబడి. ఇక వైద్యం. ఉచిత చికిత్స, ఆరోగ్య బీమా, వ్యాక్సినేషన్..ఇవి పేద కుటుంబం అనారోగ్యం పాలై అప్పులపాలు కాకుండా కాపాడతాయి. ఆరోగ్యవంతమైన సమాజం...