సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోలు హతం

| Edited By:

Aug 12, 2020 | 12:15 PM

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. సుక్మా జిల్లాలోని జాగర్‌గుండా అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారు జామున డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సీఆర్పీఎఫ్, కోబ్రా..

సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోలు హతం
Follow us on

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. సుక్మా జిల్లాలోని జాగర్‌గుండా అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారు జామున డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సీఆర్పీఎఫ్, కోబ్రా భద్రతా బలగాలు కూంబింగ్ చేపడుతుండగా.. మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు చేపట్టారు. ఈ క్రమంలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని బస్తర్ ఐజీ పీ. సుందర్ రాజ్ తెలిపారు.

Read More :

ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు

శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే