‘ బహెన్ జీ….. ‘ డియర్ సిస్టర్ ‘…. సుష్మకు ప్రపంచ నేతల నివాళి

| Edited By:

Aug 07, 2019 | 4:45 PM

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతికి ప్రపంచ వ్యాప్తంగా నేతలు నివాళులర్పించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్, బహరైన్ విదేశ వ్యవహారాల మంత్రి ఖాలిద్ బిన్ అహ్మద్ ఖలీఫా, ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, ఆ దేశ విదేశాంగ మంత్రి సలావుద్దీన్ రబ్బానీ, ఇంకా ఇండియాలోని రష్యా, ఫ్రెంచ్, ఇజ్రాయెల్ రాయబారులు సంతాప సందేశాలు పంపారు. హమీద్ కర్జాయ్, ఖాలిద్ బిన్ అహ్మద్ తమ సందేశాల్లో సుష్మా […]

 బహెన్ జీ.....  డియర్ సిస్టర్ .... సుష్మకు ప్రపంచ నేతల నివాళి
Follow us on

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతికి ప్రపంచ వ్యాప్తంగా నేతలు నివాళులర్పించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్, బహరైన్ విదేశ వ్యవహారాల మంత్రి ఖాలిద్ బిన్ అహ్మద్ ఖలీఫా, ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, ఆ దేశ విదేశాంగ మంత్రి సలావుద్దీన్ రబ్బానీ, ఇంకా ఇండియాలోని రష్యా, ఫ్రెంచ్, ఇజ్రాయెల్ రాయబారులు సంతాప సందేశాలు పంపారు. హమీద్ కర్జాయ్, ఖాలిద్ బిన్ అహ్మద్ తమ సందేశాల్లో సుష్మా స్వరాజ్ ను ‘ డియర్ సిస్టర్ ‘, ‘ బహెన్ జీ ‘ అంటూ సంబోధించి ఆమె పట్ల తమ అత్యంత అభిమానాన్ని చాటుకున్నారు. సుష్మ అసాధారణ వ్యక్తిత్వం గల మహిళ అని, ఆమె మృతితో తమ దేశం మంచి స్నేహితురాలిని కోల్పోయిందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. భారత-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను ఉన్నత స్థాయికి చేర్చడంలో సుష్మ కృషి మరువలేనిదన్నారు. ఇక-సుష్మాతో ఒకప్పుడు తాను జరిపిన ఫలవంతమైన చర్చలను ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ గుర్తు చేసుకుని ట్వీట్లు చేశారు. తనను ఆమె ఎప్పుడూ ‘ డియర్ బ్రదర్ ‘ అని ఆప్యాయంగా పిలిచేవారని బహరైన్ విదేశాంగ మంత్రి ఖాలిద్ బిన్ పేర్కొన్నారు. ‘ రెస్ట్ ఇన్ పీస్ మై డియర్ సిస్టర్, ఇండియా అండ్ బహరైన్ విల్ మిస్ యు ‘ అని ఆయన ట్వీట్ చేశారు. ఇండియాలోని ఇజ్రాయెల్ రాయబారి రాన్ మాల్కా స్వయంగా సుష్మ స్వరాజ్ నివాసానికి వెళ్లి ఆమె భౌతిక కాయానికి
శ్రధ్ధాంజలి ఘటించారు.