ఆయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం..

ఉత్తరాఖండ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్‌లోని పటేల్ నగర్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న.. సంగం ఆగ్రో ఇండస్ట్రీలో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారు జామున అకస్మాత్తుగా సంగం ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారని.. ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారని పోలీసులు తెలిపారు. అయితే భారీగా మంటలు చెలరేగడంతో.. స్థానికంగా ఉన్న ప్రజల్ని వెంటనే […]

ఆయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం..
Follow us

| Edited By:

Updated on: May 19, 2020 | 4:15 PM

ఉత్తరాఖండ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్‌లోని పటేల్ నగర్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న.. సంగం ఆగ్రో ఇండస్ట్రీలో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారు జామున అకస్మాత్తుగా సంగం ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారని.. ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారని పోలీసులు తెలిపారు. అయితే భారీగా మంటలు చెలరేగడంతో.. స్థానికంగా ఉన్న ప్రజల్ని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదానికి గురైన సంగం ఆగ్రో ఇండస్ట్రీస్‌లో రిఫైన్డ్ ఆయిల్, మస్టర్డ్ అయిల్ తయారు అవుతుందని పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, ఈ ఘటనలో ఎంత మేరకు నష్టం వాటిల్లిందన్న దానిపై కంపెనీ ఇంకా స్పష్టతనివ్వలేదు.