గాంధీజీ వర్ధంతి, సద్భావనా దివస్ సందర్భంగా రోజంతా అన్నదాతల నిరాహార దీక్షలు

| Edited By: Pardhasaradhi Peri

Jan 30, 2021 | 12:53 PM

గాంధీజీ వర్ధంతి సందర్భంగా శనివారం రోజంతా రైతులు సుదీర్ఘ దీక్షలు ప్రారంభించారు. నిన్నటి రోజంతా తాము శాంతియుతంగా ఉన్నామని, అలాగే నేడు కూడా ఈ శాంతియుత నిరశనలో..

గాంధీజీ వర్ధంతి, సద్భావనా దివస్ సందర్భంగా రోజంతా అన్నదాతల నిరాహార దీక్షలు
Follow us on

గాంధీజీ వర్ధంతి సందర్భంగా శనివారం రోజంతా రైతులు సుదీర్ఘ దీక్షలు ప్రారంభించారు. నిన్నటి రోజంతా తాము శాంతియుతంగా ఉన్నామని, అలాగే నేడు కూడా ఈ శాంతియుత నిరశనలో పాల్గొనాలని ప్రజలను కోరుతున్నామని క్రాంతికారీ కిసాన్ యూనియన్ నేత దర్శన్ పాల్ అన్నారు. సింఘు బోర్డర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ ఆందోళనను భంగపరచేందుకు యత్నిస్తోందన్నారు. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ కుట్ర పన్నుతున్నాయన్నారు. కాగా శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన దీక్షలు సాయంత్రం 5 గంటలవరకు కొనసాగుతాయని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది.