గాంధీజీ వర్ధంతి సందర్భంగా శనివారం రోజంతా రైతులు సుదీర్ఘ దీక్షలు ప్రారంభించారు. నిన్నటి రోజంతా తాము శాంతియుతంగా ఉన్నామని, అలాగే నేడు కూడా ఈ శాంతియుత నిరశనలో పాల్గొనాలని ప్రజలను కోరుతున్నామని క్రాంతికారీ కిసాన్ యూనియన్ నేత దర్శన్ పాల్ అన్నారు. సింఘు బోర్డర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ ఆందోళనను భంగపరచేందుకు యత్నిస్తోందన్నారు. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ కుట్ర పన్నుతున్నాయన్నారు. కాగా శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన దీక్షలు సాయంత్రం 5 గంటలవరకు కొనసాగుతాయని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది.