
ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమం సమయంలో ఓ వీడియో వైరల్ కావడంతో బొద్దింక జనతా పార్టీ (CJP) తమ అధికార ప్రతినిధి విజేత దహియాపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి ఆయనను తొలగించడంతో పాటు, అన్ని అధికారిక బాధ్యతల నుంచి తప్పించినట్లు సీజేపీ ప్రకటించింది.
పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీల ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టింది. ఈ నిరసన సమయంలో పలువురు కార్యకర్తలు, మద్దతుదారులపై పోలీసులు చర్యలు తీసుకున్నారని పార్టీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో పార్టీ ప్రతినిధి విజేత దహియా బర్గర్ దుకాణంలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది.
We strongly condemn the deeply insensitive actions of our spokesperson Vijeta Dahiya, whose videos surfaced while peaceful protestors and our team were facing brutal police violence. Such conduct is unacceptable, shows a complete lack of judgment, and is wholly inconsistent with…
— Cockroach is Back (@Cockroachisback) July 21, 2026
నిరసనకారులు పోలీసుల చర్యలను ఎదుర్కొంటున్న సమయంలో దహియా రెస్టారెంట్లో ఉండటంపై పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ప్రశ్నలు లేవనెత్తారు. మరో వీడియోలో కొందరు వ్యక్తులు బర్గర్ అవుట్లెట్ వద్ద దహియాను నిలదీస్తూ, నిరసనకారులతో కలిసి ఉండకుండా అక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నిస్తున్న దృశ్యాలు కనిపించాయి.
వైరల్ వీడియో ఇక్కడ చూడండి..
जंतर मंतर पर कल छात्र लाठियां खा रहे थे, उसी वक्त CJP प्रवक्ता विजेता दहिया मॉल में जाकर बर्गर खा रहा था !! pic.twitter.com/D75L0hJlZL
— Sachin Gupta (@Sachingupta) July 21, 2026
ఈ పరిణామాలపై స్పందించిన సీజేపీ, తమ ప్రతినిధి చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది. శాంతియుత నిరసనకారులు పోలీసుల చర్యలను ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి ప్రవర్తన పార్టీ విలువలకు విరుద్ధమని పేర్కొంది. అయితే వైరల్ వీడియో ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో రికార్డు అయ్యిందనే విషయాన్ని స్వతంత్రంగా నిర్ధారించలేకపోయారు.
విమర్శలపై విజేత దహియా స్పందిస్తూ, తాను నిరసన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాతే అక్కడి నుంచి వెళ్లినట్లు తెలిపారు. రెండు రోజులుగా నిద్ర లేకుండా ఉద్యమంలో పనిచేశానని, ఆకలిగా ఉండటంతో భోజనం కోసం ఆగానని చెప్పారు. బర్గర్ తినడాన్ని పెద్ద వివాదంగా మార్చడం సరైనది కాదని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, బర్గర్లోని పదార్థాలపై సందేహం రావడంతో చివరకు దానిని తినలేదని తెలిపారు. దేశం కోసం ఉద్యమంలో పాల్గొంటున్నానని, తన చర్యల్లో తప్పేమీ లేదని దహియా స్పష్టం చేశారు.
వైరల్ వీడియో ఇక్కడ చూడండి..
విజేత దహియాపై ఇది తొలి వివాదం కాదని, గతంలోనూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయని సమాచారం. తాజా ఘటనతో సీజేపీ నిరసన కార్యక్రమం కంటే ప్రతినిధి వివాదమే చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..