India Coronavirus: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. నిన్న ఎంతమంది మరణించారంటే..?

India Covid-19 Updates: దేశంలో కొన్ని రోజుల నుంచి కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ..

India Coronavirus: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. నిన్న ఎంతమంది మరణించారంటే..?
India Corona
Follow us

|

Updated on: Nov 10, 2021 | 9:45 AM

India Covid-19 Updates: దేశంలో కొన్ని రోజుల నుంచి కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి తగ్గుతున్న కేసులు ఉపశమనం కలిస్తున్నాయి. సోమవారంతో పోల్చుకుంటే.. మంగళవారం కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,466 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 460 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,88,579 కి చేరగా.. మరణాల సంఖ్య 4,61,849 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

ప్రస్తుతం దేశంలో 1,39,683 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 264 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

కాగా.. నిన్న కరోనా నుంచి 11,961 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,37,87,047 కి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది.

కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 109.63 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Also Read: