Covid 4th Wave: భారత్ మరో ఘనత.. 200 కోట్లకు చేరువలో కరోనా వ్యాక్సినేషన్.. నిన్న కేసులు ఎన్నంటే..?

ఈ మహమ్మారి కారణంగా 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

Covid 4th Wave: భారత్ మరో ఘనత.. 200 కోట్లకు చేరువలో కరోనా వ్యాక్సినేషన్.. నిన్న కేసులు ఎన్నంటే..?
India Corona
Follow us

|

Updated on: Jul 17, 2022 | 11:07 AM

India Covid-19 Updates: భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజుల నుంచి 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ (Coronavirus) అనంతరం భారీగా తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. కాగా.. గత 24 గంటల్లో శనివారం దేశవ్యాప్తంగా 20,528 కేసులు నమోదయ్యాయి. శుక్రవారంతో పోల్చుకుంటే 484 కేసులు పెరిగాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,43,449 (0.33 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 5.23 శాతం పెరగగా.. రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది.

  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,37,50,599 కి పెరిగింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,25,709 కి చేరింది.
  • నిన్న కరోనా నుంచి 17,790 మంది కోలుకున్నారు.
  • కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,30,81,441 కి చేరింది.

కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. నిన్న 25,59,840 మందికి టీకాలు వేయగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన కోవిడ్ డోసుల సంఖ్య 1,99,98,89,097 కు చేరింది. ఆదివారంతో వ్యాక్సినేషన్ మరో ఘనతను సాధించనుంది. డోసుల సంఖ్య 200 కోట్ల మార్క్ దాటనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..