Rahul Jodo Yatra: యూపీలో రాహుల్ జోడో యాత్ర.. పోటీగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సభ
ఉత్తరప్రదేశ్లో ఒక్కరోజు విరామం తరువాత భారత్ జోడో యాత్రను ప్రారంభించారు రాహుల్గాంధీ. ప్రయాగ్రాజ్లో యాత్ర కొనసాగింది. ఈనెల రాయ్బరేలిలో భారత్ జోడో యాత్రలో ప్రియాంకాగాంధీ కూడా పాల్గొంటారు. సోమవారం అమేథీలో పర్యటిస్తారు రాహుల్. ఇదే సమయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా అమేధీలో సభ నిర్వహిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లో ఒక్కరోజు విరామం తరువాత భారత్ జోడో యాత్రను ప్రారంభించారు రాహుల్గాంధీ. ప్రయాగ్రాజ్లో యాత్ర కొనసాగింది. ఈనెల రాయ్బరేలిలో భారత్ జోడో యాత్రలో ప్రియాంకాగాంధీ కూడా పాల్గొంటారు. సోమవారం అమేథీలో పర్యటిస్తారు రాహుల్. ఇదే సమయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా అమేధీలో సభ నిర్వహిస్తున్నారు.
యూపీలో మూడో రోజు రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర కొనసాగింది. ప్రయాగ్రాజ్లో పర్యటించారు రాహుల్. ఓపెన్ టాప్ జీపుపై ప్రజలకు అభివాదం చేశారు రాహుల్గాంధీ. భారత్ జోడో న్యాయయాత్రకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వం విధానాలపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు రాహుల్గాంధీ. ప్రయాగ్రాజ్లో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ, రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు OBC లేదా ST/SC వ్యక్తులను పిలవలేదని మండిపడ్డారు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్, ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వారు మాత్రమే పాల్గొన్నారన్నారు. ఆ 73 శాతం మంది ఉన్న బలహీన వర్గాల్లో ఒక్కరికి కూడా అవకాశం కల్పించలేదని ఆరోపించారు..
VIDEO | Here's what Congress leader Rahul Gandhi said while addressing a gathering in Prayagraj during his Bharat Jodo Nyay Yatra.
"Did you see the 'Ram Mandir Pran Pratishtha'? Did you see any OBC or ST/SC faces? It was attended by Amitabh Bachchan, Aishwarya Bachchan, and PM… pic.twitter.com/9wqyPziV3z
— Press Trust of India (@PTI_News) February 18, 2024
రాహుల్గాంధీ జోడో యాత్ర ఈనెల 20వ తేదీన రాయ్బరేలి లోకి ప్రవేశిస్తుంది. సోనియాగాంధ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రియాంకాగాంధీ బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. రాయ్బరేలిలో భారత్ జోడో యాత్రకు ప్రియాంకాగాంధీ కూడా హాజరవుతారు. రాయ్బరేలిలో ప్రియాంక విజయం కోసం వ్యూహం రచిస్తున్నారు రాహుల్. ఈనెల 21వ తేదీ వరకు యూపీలో భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుంది.
అంతకుముందు వయనాడ్ ప్రాంతంలో ఏనుగుల దాడిలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు రాహుల్గాంధీ. వారికి రావాల్సిన ఎక్స్గ్రేషియా త్వరగా అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఏనుగుల కదలికలను తెలిపే రాపిడ్ యాక్షన్ టీమ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇక్కడ మెడికల్ కాలేజీ అవసరం ఉందని తెలిపారు రాహుల్గాంధీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…