మాజీ కేంద్రమంత్రి కెప్టెన్ సతీశ్ శర్మ అంత్యక్రియల్లో రాహుల్ గాంధీ.. పాడె మోసిన కాంగ్రెస్ నేత
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ సతీశ్ శర్మ ఇటీవల తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న శర్మ..
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ సతీశ్ శర్మ ఇటీవల తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న శర్మ.. గోవాలో బుధవారం కన్నుముశారు. ఈ నేత అంత్యక్రియలకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. స్వయంగా సతీశ్ శర్మ పార్థివదేహాన్ని భుజంపై మోశారు. గాంధీ కుటుంబానికి సతీశ్ వీరవిధేయుడుగా పేరున్న విషయం తెలిసిందే.
1947 అక్టోబరు 11న తెలంగాణలోని సికింద్రాబాద్లో జన్మించిన సతీశ్ శర్మ.. మాజీ ప్రధాని రాజీవ్గాంధీతో అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. 1993 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో పెట్రోలియం, సహాజ వాయువుల ఉత్పత్తి మంత్రిత్వ శాఖను చేపట్టారు. అమేథీ, కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీల నుంచి 3సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు.
Also Read:
వాట్సాప్ ప్రైవసీ పాలసీపై సంస్థ సరికొత్త ప్రచారం.. కొత్త డెడ్లైన్ ఇదే..!
ఈసారి ఐపీఎల్లో కడప కుర్రాడి ఖలేజా.. దక్కించుకున్న సీఎస్కే..’ల్యాండ్ ఆఫ్ బాహుబలి’ అంటూ