Chennai: యువతి గ్యాంగ్ రేప్ ఘటనలో వెలుగులోకి సంచలనం.. అసలు ట్విస్ట్ తెలిసి పోలీసులు షాక్..
తమిళనాడులోని కాంచీపురంలో సంచలనంగా మారిన యువతీ గ్యాంగ్ రేప్ ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గ్యాంగ్ రేప్ ఘటనలో అసలు అసలు నిజం బయటపడటంతో..
తమిళనాడులోని కాంచీపురంలో సంచలనంగా మారిన యువతీ గ్యాంగ్ రేప్ ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గ్యాంగ్ రేప్ ఘటనలో అసలు అసలు నిజం బయటపడటంతో అంతా అవాక్కయ్యారు. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడనే కారణంతో ప్రియుడిని గ్యాంగ్ రేప్ కేసులో ఇరికించింది ప్రియురాలు. చెంగల్పట్టు పోలీసుల విచారణలో ఈ నిజం బయటపడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నైకి చెందిన ఓ యువతి ప్రైవేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తుంది. అయితే, ఆ అమ్మాయి సలీం అనే యువకుడిని కొన్నేళ్లుగా ప్రేమిస్తోంది. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిన అమ్మాయి.. బోర్డర్ దాటేసి అన్నింటికీ ఓకే అనేసింది. ఇంకేముంది.. అసలు కథ ఇప్పుడు మొదలైంది. పెళ్లి చేసుకోరా బాబూ అంటే.. నై నై అంటూ అటునుంచి సమాధానం వచ్చింది. వీడు ఇలా చెబితే వినేలా లేడని భావించిన అమ్మాయి.. కొత్త డ్రామాకు తెరలేపింది. శుక్రవారం రాత్రి చెంగల్పట్టు రైల్వే స్టేషన్ సమీపంలో తన ప్రియుడు సలీమ్ను కలవడానికి వెళ్తే.. అతను తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సీన్ క్రియేట్ చేసింది.
ఈ మేరకు చెంగల్పట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. అసలు నిజాన్ని చాలా సింపుల్గా రాబట్టారు. యువతి అంతా డ్రామా ప్లే చేసినట్లు గుర్తించారు. తనని ప్రేమించి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పడంతో ప్రియుడు సలీమ్ ని ఇరికించాలని.. యువతీ గ్యాంగ్ రేప్ డ్రామా ఆడినట్టు పోలీస్ విచారణలో వెల్లడైంది. దాంతో రివర్స్గా యువతిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..