మా చీఫ్ గెస్టుగా రండి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కి బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఆహ్వానం

| Edited By: Pardhasaradhi Peri

Feb 07, 2021 | 11:00 AM

ఈ నెల 10 న బోడోలాండ్ ఒప్పంద దినోత్సవ సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా హాజరు కావాలని బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీ పీ ఎఫ్) ..ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్..

మా చీఫ్ గెస్టుగా రండి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కి బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఆహ్వానం
Follow us on

ఈ నెల 10 న బోడోలాండ్ ఒప్పంద దినోత్సవ సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా హాజరు కావాలని బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీ పీ ఎఫ్) ..ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ని కోరింది. ఈ మేరకు ఆయనకు లేఖ రాసింది. గత డిసెంబరులో బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఎన్నికల అనంతరం అస్సాంలోని పాలక బీజేపీతో ఈ సంస్థ సంబంధాలను తెగదెంపులు చేసుకుంది. అయితే ఆశ్చర్యంగా అసెంబ్లీలో ఈ పార్టీకి మిత్రపక్షంగా కొనసాగుతోంది. అయితే బీహార్ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీనిచ్చిన ఆర్జేడీ మాత్రం ఈ పార్టీని వ్యతిరేకిస్తూనే ఉంది. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ను 2003 ఫిబ్రవరి 10 న బీ పీ ఎఫ్ ఏర్పాటు చేసింది. ఈ ఏడాది కూడా కొక్రాజర్ జిల్లాల్లో లక్షలాది మందితో తాము ఈ ఈ దినోత్సవ సెలబ్రేషన్స్ ని నిర్వహించనుమ్మనై, వీటికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని తేజస్వి యాదవ్ కి ఈ సంస్థ నేత హగ్రామా మొహిలారీ కోరారు.  ఒప్పంద  మీద ఈయన కూడా సంతకం చేశారు.

2003 లో ఇతరులతో కలిసి హగ్రామా పోలీసులకు తన ఆయుధాలను అప్పగించి  లొంగిపోయారు. నాటి ఒప్పంద ఫలితంగా బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా జిల్లాలు ఏర్పాటయ్యాయి. అయినా బీహార్ నేతకు, అస్సాం బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ కు లింక్ ఏమిటి అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

Also Read:

International Covid Update: శాస్త్రజ్ఞులకే సవాల్ విసురుతున్న కరోనా.. ప్రపంచంలో భారీ సంఖ్యలో కేసులు నమోదు

Photographer overaction Video: ఈ వీడియో చూస్తే.. నవ్వుతో మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం..