AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతుల సమస్యపై వారి ట్రోలింగ్ కి కారణం కేంద్రమే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజ్ థాక్రే

రైతుల ఆందోళన విషయంలో వ్యవసాయ చట్టాలను సమర్థించేట్టు ట్వీట్స్ చేయాల్సిందిగా లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్ వంటి సెలబ్రిటీలను..

రైతుల సమస్యపై వారి ట్రోలింగ్ కి కారణం కేంద్రమే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజ్ థాక్రే
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 07, 2021 | 4:36 PM

Share

 రైతుల ఆందోళన విషయంలో వ్యవసాయ చట్టాలను సమర్థించేట్టు ట్వీట్స్ చేయాల్సిందిగా లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్ వంటి సెలబ్రిటీలను కేంద్రం కోరడాన్ని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నేత రాజ్ థాక్రే తప్పు పట్టారు. ఇది ప్రభుత్వానికి సంబంధించినది కానీ దేశానికి కాదన్నారు. ముంబైలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇలా ట్వీట్స్ పోస్ట్ చేయాలని కోరడంతో వారిని అనేకమంది ట్రోల్ చేశారని అన్నారు. ఫలితంగా ఈ ప్రముఖుల ప్రతిష్ట దెబ్బతినేలా కేంద్రం చూసిందని ఆరోపించారు. ఇది చైనా నుంచో, పాకిస్తాన్ నుంచో దేశానికి ముప్పు పొంచి ఉండడం కాదని, ఇది కేంద్రానికి సంబంధించినదని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల సమస్యపై విదేశీ సెలబ్రిటీలు స్పందించినప్పుడు ట్వీట్ల ద్వారా వారికి  కౌంటర్ ఇవ్వాలని ప్రభుత్వం సూచించినట్టు చెబుతున్నారు.

లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్ వంటివారు భారత రత్న పురస్కారాలు పొందినవారని, అలాంటివారిని ఈ విధంగా కోరడం ఏమిటని రాజ్ థాక్రే ప్రశ్నించారు. ఇండియాలో అన్నదాతల ఆందోళనపై అమెరికాకాంగ్రెస్ ఎంపీలైన హేలీ స్టీవెన్స్, ఇల్హన్ ఓమర్ సహా పలువురు ప్రజాప్రతినిధులు స్పందించిన సంగతి తెలిసిందే. వీరంతా మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. అయితే రైతు చట్టాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన విదేశీ ప్రముఖుల ట్వీట్లను భారత ప్రభుత్వం ఒక విధంగా ఖండించింది. ఇది భారత అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది.

ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
చికెన్ లివర్ తింటున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి
చికెన్ లివర్ తింటున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి
వాట్సాప్‌ స్క్రీన్‌షాట్‌ కోర్టులో సాక్ష్యంగా చెల్లుతుందా?
వాట్సాప్‌ స్క్రీన్‌షాట్‌ కోర్టులో సాక్ష్యంగా చెల్లుతుందా?
ఈ సమస్యలు ఉన్నవారికి పాలు విషంతో సమానం.. పొరపాటున కూడా
ఈ సమస్యలు ఉన్నవారికి పాలు విషంతో సమానం.. పొరపాటున కూడా
ఇప్పుడు కాదు.. మళ్ళీ చూసుకుందాం!
ఇప్పుడు కాదు.. మళ్ళీ చూసుకుందాం!
భారత్ గడ్డపై 100వ అంతర్జాతీయ మ్యాచ్..కివీస్ కెప్టెన్ భావోద్వేగం
భారత్ గడ్డపై 100వ అంతర్జాతీయ మ్యాచ్..కివీస్ కెప్టెన్ భావోద్వేగం