ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ నేత కపిల్ మిశ్రా ఫైర్.. ఎందుకంటే ?

ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై బీజేపీ నేత కపిల్ మిశ్రా నిప్పులు కక్కారు. కరోనా వ్యాధికి గురై మృతి చెందినవారి సంఖ్యను తప్పుగా చూపుతున్నారని ఆయన మండిపడ్డారు..

ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ నేత కపిల్ మిశ్రా ఫైర్.. ఎందుకంటే ?

Edited By:

Updated on: May 10, 2020 | 6:33 PM

ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై బీజేపీ నేత కపిల్ మిశ్రా నిప్పులు కక్కారు. కరోనా వ్యాధికి గురై మృతి చెందినవారి సంఖ్యను తప్పుగా చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నగరంలో కరోనా కేసులు 6,542 నమోదు కాగా.. 73 మంది రోగులు మరణించారు. అయితే వీరి సంఖ్య 300 పైగానే ఉందని. కేజ్రీవాల్ సర్కార్ కావాలనే ఈ సంఖ్యను దాచిపెట్టి తక్కువగా చూపుతోందని ఆయన ఆరోపించారు. దీన్ని నిరూపిస్తానంటూ.. ఢిల్లీ లోని నిగమ్ బోధ్ ఘాట్, పంజాబీ బాగ్, ఐ టీ ఓ విద్యుత్ దహనవాటికల వద్ద రోజుకు ఎన్ని డెడ్ బాడీస్  చేరుతున్నాయో, వారి బంధువులు ఎన్నేసి గంటలు వేచి ఉండవలసి వస్తోందో లెక్కలతో సహా వివరించారు. అయితే దీనిపై కేజ్రీవాల్ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us