
నిజామాబాద్కు చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి రాముడికి పరమభక్తుడు. అయోధ్య రాముడి దివ్య పాదుకల కోసం 13 కిలోల బరువున్న ఐదు వెండి ఇటుకలు విరాళంగా ఇచ్చారు. ఇవ్వడమే కాదు, ఇచ్చేముందు వాటిని తలపై పెట్టుకుని 41 రోజులపాటు రోజుకు 41 సార్లు అయోధ్య రామ మందిరం చుట్టూ దాదాపు 38 కిలోమీటర్లు ప్రదక్షిణలు చేశారు. అప్పట్లో ఆయనకు కలియుగ భరతుడన్న పేరు పెట్టి నేషనల్ మీడియాలో చాలా కథనాలొచ్చాయి. శ్రీనివాసశాస్త్రి లాంటి భక్తాగ్రేసరులు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో కోట్లల్లో ఉంటారు. తమకు తోచిన రీతిలో భక్తిపూర్వకంగా రాముడికి కానుకలు ఇచ్చుకుంటారు. కానీ, ఆ కానుకలన్నీ రాముడికే చెందుతున్నాయా.. మధ్యలో ఎవరైనా మింగేస్తున్నారా? నిజామాబాద్ శ్రీనివాస్శాస్త్రి ఇచ్చిన వెండి ఇటుకలు ఇప్పుడెక్కడున్నట్టు? వెండి ఇటుకలేంటి, బంగారు ఇటుకల్నే మాయం చేశారట. భక్తకోటి నివ్వెరబోయేలాంటి దారుణమైన ఆర్థిక నేరాలు అయోధ్య రామ్మందిర్లో జరుగుతున్నాయట. ఇందులో నిజమెంత? ఆరా తీసేపనిలో ఉంది యూపీ సర్కార్. రామభక్తుల సంకల్పం సిద్ధించింది, కోట్లాది మంది హైందవుల కల సాకారమైంది.. వందల ఏళ్లనాటి గాయాలు, బాధల నుంచి ఉపశమనం దొరికింది…! అయోధ్యలో బాలరాముడి ఆలయ శిఖరంపై పతాకాన్ని ఎగురవేస్తూ ప్రధాని మోదీ ఇచ్చిన భావోద్వేగ సందేశం ఇది. నిజానికి, ఐదు శతాబ్దాలుగా కోర్టుల్లో నలుగుతున్న...