అయోధ్య రాముడి లెక్కల్లో ఆగమాగం.. బంగారు ఇటుకలే గాయబ్.. బాలరామా.. కనవేమిరా..

దేవుడి సొమ్ములు తిన్నవాళ్లకు, దేవుడి మాన్యాలపై కన్నేసినవాళ్లకు ఏ శిక్షలు పడతాయో స్కంద పురాణంలో క్లియర్‌గా రాసుందట. మళ్లీ జన్మలో పురుగై పుట్టి, చచ్చాక నరక ప్రాప్తి లభించి, 60 వేల ఏళ్ల పాటు సలసల మరిగే నూనెలో వేగుతారు. దైవద్రోహులు అనుభవించబోయే కఠినశిక్ష ఇది. అయోధ్య నగరవీధుల్లో కాంగ్రెస్ పార్టీ పోస్టర్లేసి మరీ ఇస్తున్న పబ్లిసిటీ ఇది. అయోధ్య రామాలయంలో తిష్టవేసిన చోర్‌కమీనేల గురించి దేశమంతటా ఘాటైన చర్చ జరుగుతోంది.. డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం..

అయోధ్య రాముడి లెక్కల్లో ఆగమాగం.. బంగారు ఇటుకలే గాయబ్.. బాలరామా.. కనవేమిరా..
Ayodhya Ram Mandir Donation Scam Allegations

Updated on: Jun 19, 2026 | 9:56 PM

నిజామాబాద్‌కు చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి రాముడికి పరమభక్తుడు. అయోధ్య రాముడి దివ్య పాదుకల కోసం 13 కిలోల బరువున్న ఐదు వెండి ఇటుకలు విరాళంగా ఇచ్చారు. ఇవ్వడమే కాదు, ఇచ్చేముందు వాటిని తలపై పెట్టుకుని 41 రోజులపాటు రోజుకు 41 సార్లు అయోధ్య రామ మందిరం చుట్టూ దాదాపు 38 కిలోమీటర్లు ప్రదక్షిణలు చేశారు. అప్పట్లో ఆయనకు కలియుగ భరతుడన్న పేరు పెట్టి నేషనల్ మీడియాలో చాలా కథనాలొచ్చాయి. శ్రీనివాసశాస్త్రి లాంటి భక్తాగ్రేసరులు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో కోట్లల్లో ఉంటారు. తమకు తోచిన రీతిలో భక్తిపూర్వకంగా రాముడికి కానుకలు ఇచ్చుకుంటారు. కానీ, ఆ కానుకలన్నీ రాముడికే చెందుతున్నాయా.. మధ్యలో ఎవరైనా మింగేస్తున్నారా? నిజామాబాద్ శ్రీనివాస్‌శాస్త్రి ఇచ్చిన వెండి ఇటుకలు ఇప్పుడెక్కడున్నట్టు? వెండి ఇటుకలేంటి, బంగారు ఇటుకల్నే మాయం చేశారట. భక్తకోటి నివ్వెరబోయేలాంటి దారుణమైన ఆర్థిక నేరాలు అయోధ్య రామ్‌మందిర్‌లో జరుగుతున్నాయట. ఇందులో నిజమెంత? ఆరా తీసేపనిలో ఉంది యూపీ సర్కార్. రామభక్తుల సంకల్పం సిద్ధించింది, కోట్లాది మంది హైందవుల కల సాకారమైంది.. వందల ఏళ్లనాటి గాయాలు, బాధల నుంచి ఉపశమనం దొరికింది…! అయోధ్యలో బాలరాముడి ఆలయ శిఖరంపై పతాకాన్ని ఎగురవేస్తూ ప్రధాని మోదీ ఇచ్చిన భావోద్వేగ సందేశం ఇది. నిజానికి, ఐదు శతాబ్దాలుగా కోర్టుల్లో నలుగుతున్న...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి