భారీగా పట్టుబడ్డ ఎయిర్‌ రైఫిల్‌ స్కోప్స్‌

| Edited By:

Jul 30, 2020 | 4:52 PM

మిజోరాంలో ఎయిర్‌ రైఫిల్స్‌ భారీగా పట్టుబడ్డాయి. చంపాయ్‌ జిల్లాలోని జోఖావ్తర్‌లో అస్సాం రైఫిల్స్‌ జరిపిన తనిఖీల్లో భారీగా అక్రమంగా నిలువ చేసిన ఎయిర్ రైఫిల్‌ స్కోప్‌ను సీజ్ చేశారు. అస్సాం..

భారీగా పట్టుబడ్డ ఎయిర్‌ రైఫిల్‌ స్కోప్స్‌
Follow us on

మిజోరాంలో ఎయిర్‌ రైఫిల్స్‌ భారీగా పట్టుబడ్డాయి. చంపాయ్‌ జిల్లాలోని జోఖావ్తర్‌లో అస్సాం రైఫిల్స్‌ జరిపిన తనిఖీల్లో భారీగా అక్రమంగా నిలువ చేసిన ఎయిర్ రైఫిల్‌ స్కోప్‌ను సీజ్ చేశారు. అస్సాం రైఫిల్స్‌కు చెందిన అధికారులు తెలిపిన ప్రకారం.. అక్రమ ఎయిర్ రైఫిల్ స్కోప్‌లు విదేశాలకు చెందినవిగా గుర్తించామన్నారు. వీటిలో బుష్నెల్, ల్యూపోల్డ్, మార్కూల్ ఉన్నాయి. సీజ్ చేసిన ఎయిర్‌ రైఫిల్‌ స్కోప్స్‌ విలువ సుమారు రూ.50లక్షల వరకు ఉంటుందన్నారు. బుధవారం చంపాయ్‌ జిల్లాలో వీటి గురించి పక్కా సమాచారం అందడంతోనే దాడులు జరిపి సీజ్ చేశామన్నారు. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామన్నారు.

 

Read More

భవనంలో భారీ పేలుడు.. 16 మందికి గాయాలు

వెస్ట్‌ బెంగాల్‌ కాంగ్రెస్ చీఫ్‌ గుండెపోటుతో మృతి

దేశంలో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే అరలక్షకు పైగా కేసులు