Maharashtra Crisis: ‘మహా’ సంక్షోభం.. థాక్రే ప్రభుత్వాన్ని కూల్చడంపై అస్సాం సీఎం ఫోకస్? టీఎంసీ ఫైర్.!

|

Jun 23, 2022 | 12:32 PM

మహారాష్ట్ర పాలిటిక్స్.. అసోంలో అగ్గి రాజేశాయి. గౌహతిలో శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Maharashtra Crisis: మహా సంక్షోభం.. థాక్రే ప్రభుత్వాన్ని కూల్చడంపై అస్సాం సీఎం ఫోకస్? టీఎంసీ ఫైర్.!
Maharashtra Politics
Follow us on

ఓవైపు అసోం వరదలతో విలవిలాడుతుంటే.. సీఎం హిమంత బిశ్వా శర్మ మాత్రం ఉద్దేవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూల్చడంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇది మేము అంటున్న మాట కాదు. టీఎంసీ నేతలది. రాష్ట్రం వరదలతో విలవిలలాడిపోతుంటే.. రక్షణ చర్యలు తీసుకోవడం మానేసి.. గౌహతీలోని ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో శివసేన రెబల్స్‌కు ఆతిథ్యం కల్పించడమేంటని టీఎంసీ నేతలు.. అస్సాం సీఎంపై ఫైర్ అవుతున్నారు. అంతేకాదు.. రాజ్యసభ ఎంపీ రిపున్‌ బోరా నేతృత్వంలో టీఎంసీ కార్యకర్తలు శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌‌ను ముట్టడించారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. శివసేన ఎమ్మెల్యేలు బయటకు రావాలని నినాదాలు చేశారు. శివసేన ఎమ్మెల్యేలను బీజేపీ బంధించిందని ఆరోపించారు. రేడిసన్‌ బ్లూ హోటల్‌ ముందు ధర్నా చేశారు. ఆందోళన చేస్తున్న టీఎంసీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కాసేపట్లో అన్ని శాఖల కార్యదర్శులతో ఉద్దవ్ థాక్రే వర్చువల్ భేటి..

కాసేపట్లో మహారాష్ట్ర సెక్రటేరియట్‌ మంత్రాలయలో అన్ని శాఖల కార్యదర్శులతో వర్చువల్‌గా భేటీ అవుతున్నారు ఉద్దవ్‌థాక్రే. ఈ సమావేశం తరువాత ఉద్ధవ్‌ థాక్రే కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికి సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు ఉద్ధవ్‌థాక్రే. మరోవైపు ఎన్సీపీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో భేటీ అవుతున్నారు శరద్‌పవార్‌ . రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. ఉద్ధవ్‌థాక్రేకే తన మద్దతని ఇప్పటికే స్పష్టం చేశారు శరద్‌పవార్‌.

(టీవీ9 తెలుగు డెస్క్)