15ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు.. బంగారు పన్ను పట్టించేసింది..

|

Feb 11, 2023 | 8:45 PM

గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని తాలూకా పోలీసులు ఎల్‌ఐసీ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ప్రవీణ్‌ను ముంబైకి పిలిపించారు. నిర్ధారణ తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు.

15ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు.. బంగారు పన్ను పట్టించేసింది..
Gold Teeth
Follow us on

15 ఏళ్లుగా కనిపించకుండా పోయిన 38 ఏళ్ల ప్రవీణ్ అశుభ జడేజాను ముంబై పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వృత్తిరీత్యా ఎల్‌ఐసీ ఏజెంట్‌గా చెప్పుకుంటున్న ఈ వ్యక్తి నోటిలో రెండు బంగారు పూత పూసిన పళ్లు ఉన్నట్లు సమాచారం. 2007లో అతను ఒక బట్టల దుకాణంలో సేల్స్‌మెన్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలోనే షాప్ యజమానిని రూ. 40,000 మోసం చేశాడు. పట్టుబడకుండా ఉండేందుకు నిందితుడు తమ అడ్రస్‌ పూర్తిగా మార్చుకుని గుజరాత్‌లోని కచ్‌కు మకాం మర్చేశాడు. ప్రవీణ్ అశుభ జడేజా అలియాస్ ప్రవీణ్ సింగ్ అలియాస్ ప్రదీప్ సింగ్ అశుభ జడేజాగా పేర్లు కూడా మార్చేసుకున్నట్లు పోలీసు తేల్చారు. చివరకు ఎలా దొరికాడంటే…

“2007లో, బట్టల దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న ప్రవీణ్, ఒకసారి మరో దుకాణదారుని నుంచి రూ. 40,000 వసూలు చేసుకు తీసుకురమ్మని యజమాని చెప్పగా, వసూలు చేసిన నగదు యజమానికి చెల్లించకుండా కాజేశాడు. దీనిపై నిలదీసిన యజమానిపై రివర్స్ లో పోలీసులకు కట్టుకథలు చెప్పాడు. ఎవరో తన షాపు యజమానికి లంచం ఇచ్చారని చెప్పి యజమానిని తప్పుదోవ పట్టించాడు.

నిందితుడు పోలీసులను మోసం చేసి తప్పుదోవ పట్టించాడని ఆరోపించారు. నిందితుడికి కొన్ని రోజుల అరెస్టు తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తరువాత, విచారణ నేపథ్యంలో నిందితుడు ముంబై నుండి పరారైనట్టు పోలీసులు తెలిపారు. మళ్లీ కోర్టుకు హాజరుకాలేదు. అందుకే పోలీసులు అతని ఆచూకీ కోసం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు.. ముంబై పోలీసులు మాట్లాడుతూ, కొన్ని రోజుల క్రితం పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ను తిరిగి ప్రారంభించారు. ప్రవీణ్‌ సింగ్‌ పాత మిత్రులు, సహచరులను విచారించారు. ప్రవీణ్ మాండ్వి సబ్రాయ్ గ్రామంలో దాక్కున్నట్లు గుర్తించారు.. గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని తాలూకా పోలీసులు ఎల్‌ఐసీ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ప్రవీణ్‌ను ముంబైకి పిలిపించారు. నిర్ధారణ తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..