80th Independence Day Live Updates: చరిత్రలో తొలిసారి జాతీయ గేయం ఆలపించాం.. ప్రధాని మోదీ సంచలన ప్రసంగం!

80th Independence Day Live Updates Telugu: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, విసిత్ భారత్ లక్ష్యంగా యువశక్తి ప్రాధాన్యతను ఈ వేడుకల్లో ప్రత్యేకంగా హైలైట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.

80th Independence Day Live Updates: చరిత్రలో తొలిసారి జాతీయ గేయం ఆలపించాం.. ప్రధాని మోదీ సంచలన ప్రసంగం!
Indias 80th Independence Day Celebrations At Redport

Updated on: Aug 15, 2026 | 8:41 AM

LIVE NEWS & UPDATES

  • 15 Aug 2026 08:41 AM (IST)

    భారత్‌లో స్థిరమైన ప్రభుత్వం ఉంది-ప్రధాని మోదీ

    భారత్‌లో స్థిరమైన ప్రభుత్వం ఉందని ప్రధాని మోదీ అన్నారు. 2014 తర్వాత 40 దేశాలతో ట్రేడ్‌ అగ్రిమెంట్‌లు చేశామని తెలిపారు. మన టెక్స్‌టైల్, ఫార్మా, మత్స్య సంపద రక్షిస్తోందన్నారు. యువకులు, మహిళలు, రైతులు, శ్రామికులపై భరోసా ఉందన్నారు. త్వరలో Next లెవెల్‌ రిఫామ్స్‌ జరగబోతున్నాయన్నారు మోదీ. సప్తధార శక్తితో దేశానికి మరింత ఊతమిస్తామన్నారు. సప్తధార శక్తిలో మొదటిది తయారీ శక్తి.. భారత్‌ని గ్లోబల్‌ సప్లై చైన్‌గా మార్చాలన్నారు.

    గ్లోబల్ మార్కెట్‌లో మన వస్తువులు క్వాలిటీ ఉండాలన్నారు. సప్తధారలో రెండోది ఫుడ్‌ ప్రొడక్షన్‌, కెమికల్‌ ఫ్రీగా ఫుడ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఉండాలన్నారు. సప్తధారలో మూడోది టెక్నాలజీ.. ఏఐ, డేటా సెంటర్స్‌లో ఇన్నోవేషన్‌ హబ్‌గా ఉండాలన్నారు. సప్తధారలో నాలుగోది గతిశక్తి.. దేశంలో ఫాస్ట్‌ కనెక్టివిటీ పెరగాలన్నారు. సప్తధారలో ఐదోది రక్షణ శక్తి డిఫెన్స్‌ రంగంలో భారత్‌ ఆత్మనిర్భర్‌గా ఎదగాలన్నారు. సప్తధారలో ఆరోది గ్రీన్‌ ఎకానమీ, బ్లూ ఎకానమీ
    సప్తధారలో ఏడోది యువశక్తి అన్నారు మోదీ.

  • 15 Aug 2026 08:36 AM (IST)

    ఏపీ శాసనమండలిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్మన్‌ మోషేన్ రాజు
    దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది
    యువతకు ఉపాధి కల్పించాలి-చైర్మన్ మోషేన్‌ రాజు
  • 15 Aug 2026 08:12 AM (IST)

    ప్రజలకు చంద్రబాబు స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు

    స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి దేశ నిర్మాణమే
    దేశం నాకు ఏం చేసిందని కాదు..
    దేశానికి ఏం చేయగలమో ఆలోచించాలి
    2047నాటికి వికసిత్ భారత్,స్వర్ణాంధ్ర సాకారం చేయాలి
    వందేళ్ల స్వాతంత్య్ర వేడుకలనాటికి సమృద్ధి సాధించాలి
    దేశం, రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగాలి-చంద్రబాబు
  • 15 Aug 2026 08:12 AM (IST)

    ప్రజలకు రేవంత్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

    నూతన ఉత్సాహం, చైతన్యం నింపాలని సీఎం ఆకాంక్ష
    సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి-సీఎం రేవంత్
    సమానత్వంతోనే బలమైన ప్రజాస్వామ్య భారత నిర్మాణం
    భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడాలి-సీఎం రేవంత్
  • 15 Aug 2026 08:07 AM (IST)

    తెలంగాణ అసెంబ్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    తెలంగాణ అసెంబ్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
    శాసన మండలిలో జెండా ఆవిష్కరించిన చైర్మన్‌ గుత్తా
  • 15 Aug 2026 07:57 AM (IST)

    వేగంగా అభివృద్ధి చెందే దేశం భారత్‌- ప్రధాని మోదీ

    • ధృడ సంకల్పంతో ముందుకెళ్లాలి-ప్రధాని మోదీ
    • 2047 నాటికి వికసిత్‌ భారత్‌ కావాలని కల ఉంది
    • భారత్‌ వైపు ప్రపంచం చూస్తోంది-ప్రధాని మోదీ
    • 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు
    • వేగంగా అభివృద్ధి చెందే దేశం భారత్‌-మోదీ
    • 140 కోట్ల మంది సంకల్పాన్ని అడ్డుకోవడం అసాధ్యం: మోదీ
  • 15 Aug 2026 07:55 AM (IST)

    PM Modi: దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

    • దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు-మోదీ
    • స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్న మోదీ
    • తొలిసారి ఎర్రకోటలో వందేమాతరం ఆలపించాం
    • దేశం కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తోంది-మోదీ
    • ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోంది
    • ప్రతి హృదయం వందేమాతరంతో మార్మోగుతోంది-మోదీ
    • మనం పెద్ద పెద్ద కలలు కనాలి: మోదీ

దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయిజ. ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 13వ సారి జాతీయజెండా ఎగురవేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా దేశ ప్రజలకు మొత్తం ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. అయితే ఈ సారి దేశ చరిత్రలోనే తొలిసారి జాతీయ గీతం కంటే ముందుగా జాతీయ గేయమైన వందేమాతారాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా జాతిని ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ మాట్లాడారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మోదీ. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. తొలిసారి ఎర్రకోటలో వందేమాతరం ఆలపించామన్నారు మోదీ. దేశం కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తోందని.. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందన్నారు. ప్రతి హృదయం వందేమాతరంతో మార్మోగుతోందని.. మనం పెద్ద పెద్ద కలలు కనాలని ఆయన అన్నారు.

ధృడ సంకల్పంతో ముందుకెళ్లాలని.. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ కావాలని కల ఉందన్నారు. భారత్‌ వైపు ప్రపంచం చూస్తోందని.. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారన్నారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందే దేశమని..140 కోట్ల మంది సంకల్పాన్ని అడ్డుకోవడం అసాధ్యమని ప్రధా మోదీ అన్నారు. వికసిత్‌ భారత్‌ కోసం ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలని.. ఆత్మ నిర్భార్‌ భారత్‌గా ఎదగాలన్నారు ప్రధాని మోదీ. మెకిన్‌ ఇండియా, స్వదేశీ, ఓకల్‌ ఫర్‌ లోకల్‌ను దేశ ప్రజలు ఆదరిస్తున్నారన్నారు.

మోదీ ప్రసంగం ఇక్కడ చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us