Bird Flu: నెల రోజుల వ్య‌వ‌ధిలో ఏడు వేల‌కుపైగా ప‌క్షులు మృతి… స్వ‌యంగా తెలిపిన ఆ రాష్ట్ర ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌…

రాజస్థాన్ రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూతో నెల రోజుల్లో ఏడు వేలకుపైగా పక్షులు మరణించాయి...

Bird Flu: నెల రోజుల వ్య‌వ‌ధిలో ఏడు వేల‌కుపైగా ప‌క్షులు మృతి... స్వ‌యంగా తెలిపిన ఆ రాష్ట్ర ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌...

Updated on: Jan 30, 2021 | 8:11 PM

రాజస్థాన్ రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూతో నెల రోజుల్లో ఏడు వేలకుపైగా పక్షులు మరణించాయి. గత ఏడాది డిసెంబర్‌ 25 నుంచి జ‌న‌వ‌రి 25 వ‌ర‌కు 7,187 పక్షులు చనిపోయినట్లు ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ తెలిపింది. మృతి చెందిన పక్షులలో 4,976 కాకులు, 427 నెమళ్ళు, 683 పావురాలు, 1,101 ఇతర పక్షులు ఉన్నాయని పేర్కొంది. రాజస్థాన్‌లోని 17 జిల్లాల్లో ఏవియన్ ఇన్‌ఫ్లూఎంజా (బర్డ్ ఫ్లూ) నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వివరించింది. అయితే పరిస్థితి అదుపులోనే ఉన్నదని, బర్డ్‌ ఫ్లూ నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కాగా… దేశంలోని కేర‌ళ వంటి ప‌లు రాష్ట్రాల్లో సైతం బ‌ర్డ్‌ఫ్లూతో ప‌క్షులు అధిక సంఖ్య‌లో చ‌నిపోతున్నాయి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us