
’18 పర్సెంట్ టారిఫ్’ ఓ కనిపించని ఆయుధం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ఓ బ్రహ్మస్త్రం. బంగ్లాదేశ్ సైతం బెంబేలెత్తిపోయింది ఈ ’18 పర్సెంట్’ వెపన్ చూసి. ‘కోటి ఉద్యోగాలు ఖతమ్’ అని పాకిస్తాన్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది. తెగ మిడిసిపడిన బంగ్లాదేశ్కైతే.. దెబ్బ తగిలినట్టే లేదు గానీ బొబ్బలు మాత్రం తేలాయ్. పాక్-బంగ్లా అనే కాదు.. భారత్కు మేమే పోటీగా అని చెప్పుకుంటున్న కొన్ని దేశాలు ’18 పర్సెంట్’ బుల్డోజర్ కింద పడి నలిగిపోయాయి. అసలు.. యూరోపియన్ యూనియన్తో చేసుకున్న ఒప్పందమే అత్యంత భారీది. పవర్ షిఫ్ట్ అంటారే.. అలాంటి డీల్ అది. భారత్ను ఎకనమిక్ పవర్ హౌస్గా చేసే డీల్ యూరప్తో కుదిరింది. ఇప్పుడు అమెరికాతోనూ డీల్ కుదరడంతో.. ఇక భారత్కు తిరుగులేదని నిరూపించుకుంది. ఇంతకీ.. ఏంటి దీనివల్ల లాభం మనకి. నేరుగా గోదావరి జిల్లాల్లో ల్యాండ్ అవుదాం. అక్కడి రొయ్యని వెళ్లి అడగండిప్పుడు.. ‘ఆర్ యూ హ్యాపీ’ అని. ఎగిరి గంతేసి ఇదేనా సమాధానం అని చెబుతుంది. అమెరికా వెళ్లబోతున్నానోచ్ అని బ్యాగ్ సర్దేసుకుంటుంది. ట్రంప్ విధించిన టారిఫ్తో బాగా నష్టపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశే. భారత్కు డాలర్లను పట్టుకొచ్చే పంటను పండిస్తున్నారు ఏపీ రైతులు. అలాంటి రొయ్యల ఎగుమతులపై ట్రంప్ సుంకాల భారం పడింది. ఇప్పుడిక భయం లేదు. ఆక్వా రైతుకు మళ్లీ మంచి రోజులొచ్చాయ్. ఇక హైదరాబాద్కొద్దాం. ఇక్కడి రియల్ ఎస్టేట్కి మరిన్ని శుభాలు జరగబోతున్నాయి....