నిర్ణయం గొప్పదైతే.. సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారు..?
వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్కు సూటిగా ప్రశ్నలు సంధించారు. రాజధాని విభజన నిర్ణయం అద్భుతమైందంటూ వైసీపీ శ్రేణులు డప్పుకొడుతున్నాయని.. నిర్ణయం అంతగొప్పదైనప్పుడు జగన్ ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు. 13 జిల్లాల్లో టీడీపీ నేతల్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారన్నారు. మా నాయకులు చేసిన తప్పేంటో చెప్పాలన్నారు. నిరసన తెలిపే హక్కుని కాలరాసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారన్నారు. గ్రామాల్లో పోలీసు లాఠీలు, ముళ్ల […]
వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్కు సూటిగా ప్రశ్నలు సంధించారు. రాజధాని విభజన నిర్ణయం అద్భుతమైందంటూ వైసీపీ శ్రేణులు డప్పుకొడుతున్నాయని.. నిర్ణయం అంతగొప్పదైనప్పుడు జగన్ ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు. 13 జిల్లాల్లో టీడీపీ నేతల్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారన్నారు. మా నాయకులు చేసిన తప్పేంటో చెప్పాలన్నారు.
నిరసన తెలిపే హక్కుని కాలరాసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారన్నారు. గ్రామాల్లో పోలీసు లాఠీలు, ముళ్ల కంచెలతో ఉద్యమాన్ని అణిచివేయడం సాధ్యం కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యమాన్ని ఎంత తొక్కాలి అనుకుంటే.. అంతకి పదింతలు ఉద్యమం ఉధృతం అవుతుందంటూ ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
రాజధాని విభజన నిర్ణయం అద్భుతం అని వైకాపా నాయకులు డప్పు కొడుతున్నారు. నిర్ణయం అంత గొప్పదయితే @ysjagan గారు ఎందుకు భయపడుతున్నారు? 13 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులని ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? మా నాయకులు చేసిన తప్పేంటి?(1/2)
— Lokesh Nara (@naralokesh) January 19, 2020
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుని కాలరాసే అధికారం ఈ జగన్ గారి ప్రభుత్వానికి ఎవరిచ్చారు? గ్రామాల్లో పోలీసు లాఠీలు, ముళ్ల కంచెలతో ఉద్యమాన్ని అణిచివేయడం సాధ్యం కాదు. వైకాపా ప్రభుత్వం ఎంత తొక్కాలి అనుకుంటే అంతకి పదింతలు ఉద్యమం ఉధృతం అవుతుంది.(2/2)#APWithAmaravati #MyCapitalAmaravati
— Lokesh Nara (@naralokesh) January 19, 2020