సీఎం జగన్‌కి ముద్రగడ లేఖ.. కాపు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి..

ఏపీ సీఎం జగన్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు కులానికి న్యాయం చేయాలని లేఖలో పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు అసంపూర్ణంగా వదిలేసిన కాపు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. 2019 ఎన్నికల్లో కాపు కులానికి చెందిన పార్టీని కూడా కాదని మా కులమంతా వైసీపీకే ఓటు వేశారని గుర్తుచేశారు. కాపు జాతికి వైసీపీ ప్రభుత్వం న్యాయం చేయగలదని నమ్ముతున్నానని అన్నారు. ఆ విషయం గుర్తించి కాపులకు న్యాయం చేయాలని […]

సీఎం జగన్‌కి ముద్రగడ లేఖ.. కాపు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి..
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2019 | 1:14 PM

ఏపీ సీఎం జగన్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు కులానికి న్యాయం చేయాలని లేఖలో పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు అసంపూర్ణంగా వదిలేసిన కాపు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. 2019 ఎన్నికల్లో కాపు కులానికి చెందిన పార్టీని కూడా కాదని మా కులమంతా వైసీపీకే ఓటు వేశారని గుర్తుచేశారు. కాపు జాతికి వైసీపీ ప్రభుత్వం న్యాయం చేయగలదని నమ్ముతున్నానని అన్నారు. ఆ విషయం గుర్తించి కాపులకు న్యాయం చేయాలని కోరారు. తాను లేఖలో రాసిన విషయాలు నిజమని నమ్మితేనే కాపు జాతికి న్యాయం చేయాలని లేఖలో విన్నవించారు.