ఇలాంటి మెసేజ్లతో జాగ్రత్త..సైబర్ పోలీసుల హెచ్చరిక
కరోనా, లాక్డౌన్ను ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఈ-సిమ్ పేరుతో సైబర్ నేరగాళ్లు నయా దందాకు తెర తీశారు. సిమ్ కార్డు అప్డేట్ పేరుతో అమాయకులను నిండా ముంచేస్తున్నారు.
కరోనా, లాక్డౌన్ను ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఈ-సిమ్ పేరుతో సైబర్ నేరగాళ్లు నయా దందాకు తెర తీశారు. సిమ్ కార్డు అప్డేట్ పేరుతో అమాయకులను నిండా ముంచేస్తున్నారు. 24 గంటల్లో సిమ్ బ్లాక్ అవుతుందంటూ మెసేజ్లు పంపుతున్నారు. రిజిస్ట్రేషన్, ఈ మెయిల్, అప్ డేట్ అంటూ అమాయక ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో ఇటువంటి కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ- సిమ్ కార్డ్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మార్గం ఎంచుకున్నారు. సిమ్ కార్డ్ అప్ డేట్ అంటూ ఫోన్ చేస్తారు.. సిమ్ కార్డు బ్లాక్ అవుతుందని మెసేజ్ పెడుతుండటంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. మెసేజ్లో వచ్చిన నెంబర్లకు ఫోన్ చేస్తున్నారు. సిమ్ బ్లాక్ కాకుండా ఉండేందుకు ఆన్లైన్ కేవైసీ నింపాలని కేటుగాళ్లు చెబుతుండగా, తెలియక అమాయకంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి పంపిస్తున్నారు. దీనిద్వారా వినియోగదారుల ఫోన్ నెంబర్లు హ్యాక్ చేసి, బ్యాంకులో ఉన్న నగదును లూటీ చేస్తున్నారు. ఇటువంటి ఫేక్ ఫోన్కాల్స్, మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఫోన్ చేసే అడిగే ఎవ్వరికీ వివరాలు చెప్పొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.