‘డిస్కోరాజా’కు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉంటుంది: రవితేజ
అన్ని సవ్యంగా కుదిరితే ‘డిస్కోరాజా’ మూవీకి ప్రీక్వెల్ లేదా సీక్వెల్ గానీ ఉంటుందని తెలిపారు హీరో రవితేజ. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డిస్కోరాజా’. వీఐ ఆనంద్ దర్శకత్వంగా పక్కా మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కింది. పాయల్ రాజ్పుత్, నభా నటేష్, తాన్య హోప్ హీరోయిన్స్గా ఆడిపాడారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీని రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ నెల 24న ఈ చిత్రం ఆడియెన్స్ను పలుకరించబోతుంది. ఆదివారం ‘డిస్కోరాజా’ మూవీ ప్రీ […]
అన్ని సవ్యంగా కుదిరితే ‘డిస్కోరాజా’ మూవీకి ప్రీక్వెల్ లేదా సీక్వెల్ గానీ ఉంటుందని తెలిపారు హీరో రవితేజ. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డిస్కోరాజా’. వీఐ ఆనంద్ దర్శకత్వంగా పక్కా మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కింది. పాయల్ రాజ్పుత్, నభా నటేష్, తాన్య హోప్ హీరోయిన్స్గా ఆడిపాడారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీని రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ నెల 24న ఈ చిత్రం ఆడియెన్స్ను పలుకరించబోతుంది.
ఆదివారం ‘డిస్కోరాజా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మంచి జోష్తో మాట్లాడారు రవితేజ. తాను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన క్యారక్టరైజేషన్స్ అన్నీ ఈ చిత్రంలో చేశానని పేర్కొన్నారు. షూటింగ్ టైంలో ఫుల్గా ఎంజాయ్ చేశానని చెప్పిన రవితేజ, అదే ఎంజామ్మెంట్ ఫ్యాన్స్కు కూడా ఉంటుందని హామి ఇచ్చారు. బాబీ సింహా, రాంకీ లాంటి యాక్టర్స్తో తొలిసారి కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని పేర్కొన్నారు. మాములుగా ఎప్పుడూ ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్స్తో నటించానని, తొలిసారి ‘డిస్కోరాజా’ మూవీ కోసం ముగ్గురు హీరోయిన్స్తో కలిసి నటించానన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో తాను 11 సినిమాలు చేశానని..తన నెక్ట్స్ మూవీ ‘క్రాక్’ 12 చిత్రం అవుతుందని తెలిపారు.