అత్తింటి ముందే అల్లుడి ఆత్మహత్య, రీజన్ ఇదే
కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మనస్పర్థల నేపథ్యంలో పుట్టింటికి వెళ్లిన భార్యను వెనక్కి తెచ్చుకుందామని వెళ్లిన వ్యక్తి, అత్తింటి ముందే ఆత్మహత్య చేసుకున్నాడు.
కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మనస్పర్థల నేపథ్యంలో పుట్టింటికి వెళ్లిన భార్యను వెనక్కి తెచ్చుకుందామని వెళ్లిన వ్యక్తి, అత్తింటి ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని పెద్దముడియం మండలం గుండ్లకుంట గ్రామానికి చెందిన బి.రాజశేఖర్(26)కి ప్రొద్దుటూరుకి చెందిన బొమ్మిశెట్టి లక్ష్మీనారాయణ కూతురు వైజయంతితో గతేడాది డిసెంబరులో వివాహమైంది. రెండు నెలలకే ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు మొదలయ్యాయి. భర్తతో గొడవపడిన భర్తతో ఉండనంటూ పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్ద మనుషులు పంచాయితీ చేయడంతో ప్రొద్దుటూరులో కాపురం పెడితేనే వస్తానని తెగేసి చెప్పడంతో మూడు నెలల కిందట పట్టణానికి మకాం మార్చారు. మరోసారి ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో భార్య మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అత్తింటికి వెళ్లిన రాజశేఖర్ ఇంటికి రావాలని భార్యను కోరాడు. రానని ఆమె తెగేసి చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అత్తింటి ముందే పురుగులమందు తాగేశాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి తండ్రి బాబులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read :