షూటింగ్ సెట్ లో మహేశ్..కానీ
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా, సీరియల్ షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో సినిమా సెలబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితమై కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడిపారు.
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా, సీరియల్ షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో సినిమా సెలబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితమై కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడిపారు. కాగా మళ్ళీ ఈ మధ్యే ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వడంతో షూటింగుల హడావిడి మొదలైంది. టాలీవుడ్ లో కూడా చిత్రీకరణలు పున: ప్రారంభమవుతున్నాయి. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేశ్ కూడా ఈ రోజు షూటింగ్ ప్రారంభించారు. అందుకోసం ఆయన సెట్స్ కు వెళ్లిన ఫోటోను ”మహేశ్ బాబు టీం” సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రజంట్ ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
అయితే అది సినిమా షూటింగ్ కాదు. మహేశ్ బాబు ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. త్వరలోనే ఆయన సినిమా షూట్ కూడా స్టార్ట్ చేస్తారు అని తెలుస్తుంది. ఇక సంక్రాంత్రికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో వచ్చిన మహేశ్ బాబు సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను చేస్తున్నాాడు మహేశ్. ఇక ఈ సినిమాలో మహేష్ కు జంటగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించనుంది.
Also Read :