ఆక్టివాతో వార్తల్లోకి ఎక్కాడు.. ఎలాగో తెలిస్తే నవ్వుకుంటారు..!

జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అంటారు. అలానే మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి పుర్రెకు తట్టిన ఐడియా ఆయన్ను ఇప్పుడు వార్తల్లోకి ఎక్కించింది. చేసిన పని చిన్నదనుకున్నా.. బహుశా.. ఇలాంటి పని చేసి వాహనం కొన్నది ఇతనేనేమో. సాధారణంగా మనం వాహనం కొనాలనుకుంటే మంచి రోజు.. ముహూర్తం చూస్తాం. ఇంకా కొనే రోజు పండుగ రోజైతే ఇంకా బాగుంటుందనుకుంటాం. అలా చేస్తే మనకు వాహనం కొన్న విషయం సులువుగా గుర్తుండిపోతుంది అన్న ఆశ కూడా. అయితే మధ్యప్రదేశ్‌లోని వ్యక్తి.. […]

ఆక్టివాతో వార్తల్లోకి ఎక్కాడు.. ఎలాగో తెలిస్తే నవ్వుకుంటారు..!
Follow us

| Edited By:

Updated on: Oct 27, 2019 | 6:38 AM

జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అంటారు. అలానే మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి పుర్రెకు తట్టిన ఐడియా ఆయన్ను ఇప్పుడు వార్తల్లోకి ఎక్కించింది. చేసిన పని చిన్నదనుకున్నా.. బహుశా.. ఇలాంటి పని చేసి వాహనం కొన్నది ఇతనేనేమో. సాధారణంగా మనం వాహనం కొనాలనుకుంటే మంచి రోజు.. ముహూర్తం చూస్తాం. ఇంకా కొనే రోజు పండుగ రోజైతే ఇంకా బాగుంటుందనుకుంటాం. అలా చేస్తే మనకు వాహనం కొన్న విషయం సులువుగా గుర్తుండిపోతుంది అన్న ఆశ కూడా. అయితే మధ్యప్రదేశ్‌లోని వ్యక్తి.. పొలిటికల్ లీడర్లను ఫాలో అయినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో ఓ పొలిటికల్ లీడర్‌ నామినేషన్ దాఖలు చేసేందుకు వినూత్నంగా వెళ్లాడు. అంటే చిత్రవిచిత్ర వేషాలు కాదండోయ్.. నామినేషన్‌కు సమర్పించే డబ్బుల విషయంలో. వెరైటీగా ఉండి వార్తల్లోకి ఎక్కాలనుకుని.. నామినేషన్‌కు సమర్పించాల్సిన డబ్బును చిల్లరను తీసుకెళ్లి.. ఎన్నికల అధికారులకు.. మీడియాకు గుర్తుండిపోయేలా చేశాడు. ఆయన్ను చూసి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పలుచోట్ల అలాంటి ఘటనలు జరిగాయి.

అయితే తాజాగా మధ్యప్రదేశ్‌ సత్నా జిల్లాకు చెందిన రాకేష్ కుమార్ గుప్తా కూడా ఇలాంటి పనిచేసి వార్తల్లోకి ఎక్కారు. దీపావళి సందర్భంగా ఆక్టివా 125 వాహనం కొనాలని నిశ్చయించకున్నాడు. అంతే షోరూం వెళ్లి దాని ధర వివరాలు కనుకున్నాడు. దాని ధర రూ. 83వేలు అని తెలిసి.. అంత డబ్బు సమకూర్చుకుని షోరూం మెట్టెక్కాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ ఆక్టివా కోసం డబ్బును కరెన్సీ నోట్లతో కాకుండా చిల్లర నాణేల రూపంలో చెల్లించాడు. దీంతో అదిచూసిన షోరూం సిబ్బంది అవాక్కయ్యారు.

స్థానిక హోండా డీలర్‌షిప్‌ నుంచి బండి కొనుగోలు చేసిన రాకేశ్‌.. వారికి రూ. 83వేల విలువ గల నాణేలు చెల్లించారు. ఇందులో ఎక్కువగా రూ.5, రూ. 10 నాణేల ఉన్నాయట. దీంతో ఆశ్యర్యపోయిన డీలర్‌షిప్‌ సిబ్బంది మొత్తం 3 గంటలకు పైగా శ్రమించి నాణేలను లెక్కించారట. అయితే రాకేశ్‌ అంతమొత్తాన్ని నాణేల రూపంలో ఎందుకు చెల్లించారో తెలియదు గానీ.. ఆయన ఫొటోలు, డీలర్‌షిప్‌ సిబ్బంది నాణేలను లెక్కబెడుతున్న ఫొటోలు మాత్రం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. కొంటే ఇలానే కొని రికార్డులకెక్కాలంటూ కామెంట్లు పేలుతున్నాయి. పుర్రెకొచ్చిన ఐడియా.. ఇవాళ వార్తల్లోకి ఎక్కెలా చేసింది రాకేష్‌ కుమార్ గుప్తాను.

'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..