
రెండు మూడు రోజులు సెలవులు వస్తేనే ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళాలని తెలుగువారు కోరుకుంటారు. మరి వేసవి కాలంలో వచ్చే సుదీర్ఘమైన సెలవులు వస్తే .. ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తారు. తక్కువ ధరలోనే బెస్ట్ ప్లేసెస్ ను సందర్శించాలని కోరుకుంటారు. అలా ఎక్కువ మంది వెళ్లాలనుకునే ఆధ్యాత్మిక ప్రదేశం షిర్డీ. IRCTC టూరిజం విజయవాడ నుంచి మొదలయ్యే ఈ టూర్ తక్కువ బడ్జెట్ లోనే ఈ యాత్రను చేసేందుకు వీలుకల్పిస్తోంది. మార్చి 25వ తేదీ 2025న ఈ సూపర్ ప్యాకేజీ సాయి సన్నిధి ఎక్స్ విజయవాడ (SAI SANNIDHI EX VIJAYAWADA) పేరుతో అందుబాటులో ఉంది. ఈ రోజు ఈ షిర్డీ టూర్ ప్యాకేజీ గురించి పూర్తి డీటైల్స్ తెలుసుకుందాం..
మార్చి నెలలో షిర్డీ సాయి బాబాను తక్కువ ధరలోనే అన్ని సౌకర్యాలతో దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా.. IRCTC అందిస్తోన్న ఈ ప్యాకేజీని ఎంచుకోండి. 4 రోజుల పాటు టూర్ ఉండనుంది. ఈ నెల 25 తేదీన విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు 10.15 గం. షిర్డీ ఎక్స్ప్రెస్ ట్రైన్ (17208- Sainagar Shirdi Express) ఎక్కాల్సి ఉంటుంది. తర్వాత ఈ ట్రైన్ ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ స్టేషన్లలో హాల్ట్ ఉంది. రాత్రి అంతా ప్రయాణించి రెండో రోజు ఉదయం 6.15 గం. కు నాగర్సోల్ చేరుకుంటారు.
ఇక్కడ నుంచి షిర్డీ కి వెళ్తారు. అక్కడ ప్రెషప్ అయ్యి.. తర్వాత షిరిడి సాయి బాబా ఆలయానికి వెళ్లి బాబాను దర్శించుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం వరకూ స్థానికంగా ముఖ్యమైన ప్రదేశాలను, షాపింగ్ ను చేయవచ్చు. రాత్రికి హోటల్ కు చేరుకొని బస చేయాల్సి ఉంటుంది.
మూడో రోజు ఉదయం షిర్డీలో టిఫిన్ తిని శనిశిగ్నాపూర్ కు వెళ్తారు. అక్కడ శనిశ్వరుడిని దర్శించుకుని మళ్ళీ తిరిగి షిర్డీ చేరుకుంటారు. హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి.. నాగర్సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి.
రాత్రి 7.29 గం. లకు తిరుగు విజయవాడ ప్రయాణం కావాల్సి ఉంది. నాలుగో రోజు తెల్లవారు జామున విజయవాడ రిల్వే స్టేషన్ కు చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుంది.
ఈ టూర్ ప్యాకెజీని ఎంపిక చేసుకుని షిర్డీ, శనిశిగ్నాపూర్ కు తక్కువ ఖర్చుతో ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళాలనుకుంటే మరిన్ని సమాచారం కోసం.. ఈ లింక్ పై క్లిక్ చేయండి. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 040-27702407, 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు. పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..