
హైదరబాద్ నుంచి షిర్డీ క్షేత్రానికి రోజూ వేలాది మంది సాయిబాబా భక్తులు వెళ్తుంటారు. సాయిబాబా దర్శనం కోసం వెళ్ళే భక్తులు బస్సులు, రైళ్లు, టూరిజం బస్సులు వంటి వాటిని ఎంచుకుంటారు. అయితే చాలా మందికి షిర్డీ వెళ్లాలని ఉన్నా.. ధర తమకు అందుబాటులో లేదు అంటూ భావిస్తారు.. అటువంటి వారి కోసం తాజా IRCTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. తక్కువ ధరకే సాయి సన్నిధి ఎక్స్ హైదరబాద్ అనే పేరుతో ప్రత్యేక షిర్డీ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెలలో ప్రారంభం కానున్న ఈ టూర్ 2 రాత్రులు, 3 రోజులపాటు సాగనుంది. ప్రతి బుధవారం అందుబాటులో ఉండనున్నది. ఈ టూర్ ప్యాకేజీకి లో టికెట్స్ బుక్ చేసుకోవాలనుకునేవారు IRCTC వెబ్సైట్ https://www.irctctourism.com/ అనే సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.
టూర్ డీటైల్స్
ఈ నెల అక్టోబర్ 29 తేదిన కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి (రైలు నెంబర్ 17064) సాయంత్రం 6,40 గంటలకు జర్నీ స్టార్ అవుతుంది. సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ వంటి స్టేషన్ల మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది. బుధవారం రాత్రి అంతా ప్రయాణం చేసి మహారాష్ట్రలోని నాగర్ సొల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. ఇక్కడ అనుంచి షిర్డీకి ప్రత్యెక వాహనం ద్వారా చేరుకుంటారు. రెండో రేజు ఉదయం శిర్దీలోని హోటల్లో చెక్-ఇన్ అవ్వాలి. అల్పాహారం తిని షిర్డీ సాయిబాబా దర్శనం కోసం ఆలయానికి చేరుకోవాలి. సాయంత్రం 5 గంటలకు హోటల్ చెక్ అవుట్ అయ్యి.. రాత్రి 7.30 గంటల నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. రెండో రోజు రాత్రంతా ప్రయాణం చేసి… మూడో రోజు ఉదయం 9:45కి కాచిగూడకు చేరుకోవాలి.
సింగిల్ షేరింగ్ రూ. 7,890, కంఫర్ట్ క్లాస్లో రూ. 6,220
డబుల్ షేరింగ్ రూ. 6,660 కంఫర్ట్ క్లాస్ లో రూ. 4,980
ట్రిపుల్ షేరింగ్ రూ. 6,640 కంఫర్ట్ క్లాస్ లో రూ. 4,960 లు చెల్లించాల్సి ఉంటుంది.
5-11 ఏళ్ల పిల్లలకు విత్ బెడ్ స్లీపర్ లో రూ. 4060 , బెడ్ లేకుండా అయితే రూ.3750
5-11 ఏళ్ల పిల్లలకు విత్ బెడ్ కంఫర్ట్ క్లాస్ లో రూ. 5730 బెడ్ లేకుండా అయితే రూ.5420 లు చెల్లించాల్సి ఉంటుదని. ఈ టూర్ ప్యాకేజీ కోసం మరిన్ని వివరాల కోసం అధికారిక IRCTC వెబ్సైట్ ను సందర్శించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..