How to Eat Mangoes: నీళ్లలో నానబెట్టకుండా మామిడి పండ్లు తింటున్నారా? జాగ్రత్త..బరువు పెరుగుతారట
వేసవిలో మాత్రమే దర్శనమిచ్చే మామిడి పండ్ల కోసం ఏడాదంతా ఆశగా ఎదురు చూసే వారు మనలో చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం వేసవి నడుస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటిపోతున్నాయి. రకరకాల మామిడి పండ్లు మార్కెట్లో కొలువుదీరాయి. పండిన మామిడికాయలు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇంత వేడిలో మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా అని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి, ఈ సీజనల్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో..
వేసవిలో మాత్రమే దర్శనమిచ్చే మామిడి పండ్ల కోసం ఏడాదంతా ఆశగా ఎదురు చూసే వారు మనలో చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం వేసవి నడుస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటిపోతున్నాయి. రకరకాల మామిడి పండ్లు మార్కెట్లో కొలువుదీరాయి. పండిన మామిడికాయలు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇంత వేడిలో మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా అని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి, ఈ సీజనల్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ పండ్లను తినే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్లో మామిడి పండ్లను కొన్న తర్వాత బాగా కడగడం మర్చిపోకూడదు. అంతకంటే ముందు ఓ గంట పాటు నీళ్లలో వీటిని నానబెట్టాలి. పండిన మామిడి పండ్లను ఎల్లప్పుడూ నీళ్లలో నానబెట్టి తినాలని చెబుతున్నారు నిపుణులు. కానీ ఎందుకు నాళ్లలో నానబెట్టాలి? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణుల మాటల్లో మీకోసం..
నిజానికి, మామిడి తొక్కలో ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ న్యూట్రియంట్ ఉంటుంది. ఈ ఫైటిక్ యాసిడ్ శరీరానికి హానికరం. ఇది శరీరం పోషకాలను గ్రహించకుండా నిరోధిస్తుంది. ఫైటిక్ యాసిడ్ ఐరన్, జింక్, కాల్షియం వంటి ముఖ్యమైన మూలకాల శోషణను నిరోధిస్తుంది. మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల ఈ ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. అంతేకాకుండా మామిడి తొక్కలో చాలా హానికరమైన పదార్థాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలుకు బదులు కీడు చేస్తాయి. చర్మం కూడా సమస్యలకు గురవుతుంది. మొటిమలు, దద్దుర్లు, ప్రేగు సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు నివారించడానికి మామిడి పండ్లను నీటిలో నానబెట్టాలి.
నేటి కాలంలో మార్కెట్లో లభించే కూరగాయలు, పండ్లు చాలా వరకు రసాయనాలతో నిండి ఉంటున్నాయి. ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి పురుగుమందులు వినియోగిస్తున్నారు. మామిడిపండ్లపై కూడా అనేక రకాల రసాయనాలు వేస్తారు. అవి శ్వాసలోపం, వికారం, తలనొప్పి సమస్యను పెంచుతాయి. మామిడికాయలను ఒక గంటపాటు నీటిలో నానబెట్టడం వల్ల ఈ హానికరమైన అంశాలు తొలగిపోతాయి. మామిడికాయ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అయితే వేసవిలో శరీరాన్ని ఎంత చల్లగా ఉంచుకుంటే అంత మంచిది. బదులుగా మామిడికాయలను నీటిలో గంటసేపు నానబెట్టడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. అలాగే మామిడిలో ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఈ రసాయనం శరీరంలో కొవ్వును పెంచుతుంది. అందుకే నీళ్లలో నానబెట్టాలి. మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల ఈ ఫైటోకెమికల్స్ గాఢత తగ్గుతుంది. మామిడి పండు తిన్నాక కొవ్వు పేరుకుపోయే అవకాశం కూడా తగ్గుతుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.